ఇంటింటా గ్రంధాలయం పథకం విజయవంతం కావాలని తెలుగుదేశం నాయకుడు నాదెండ్ల కిషోర్ కుమార్ ఆకాంక్షించారు. ఆదివారం (16-8-2015) బోనకల్ లో జరిగిన పల్లె ప్రపంచం ఫౌండేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. మార్కెటింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తూ ఇంటింటా గ్రంధాలయాలు ఉండేలా చేస్తున్న పల్లె ప్రపంచం కార్యక్రమం అభినందనీయమన్నారు. 

పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున మార్కెటింగ్ చేయడానికి గాను మరో నాలుగు కొత్త ప్రొడక్టులను ఆదివారం నాడు ప్రారంభించడం జరిగింది. రంగనాయకమ్మ రచించిన కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? పుస్తకాన్ని బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండా ప్రారంభించగా లగడపాటి రామారావు కొనుగోలు చేశారు. రాజేష్ రాఖేడ్ మరియు గుర్రం కనకదుర్గ రచించిన 'చత్రపతి శివాజీ' పుస్తకాన్ని బి.జె.పి రాష్ట్ర నాయకుడు దొంతు జ్వాలా నరసింహారావు ప్రారంభించి కొనుగోలు చేశారు. టి.సాయి వశిష్ట రచించిన 'ఆదర్శ శాస్త్రవేత్త-భారతరత్న ఎ.పి.జె అబ్దుల్ కలాం' పుస్తకాన్ని లగడపాటి రామారావు ప్రారంభించగా చల్లగుండ్ల శ్రీనివాస రావు కొనుగోలు చేశారు. సంతూర్ 100 గ్రా. సబ్బుని రామన అప్పారావు ప్రారంభించగా బోయనపల్లి అంజయ్య కొనుగోలు చేశారు.

సంస్థ తరపున మార్కెటింగ్ చేసే పుస్తకాల ద్వారా ఇంటింటా గ్రంధాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆదాయం కూడా వచ్చేలా చేసినట్లు తద్వారా ప్రతి ఇంటిలో మంచి పుస్తకాలను ఉంచేలా ఏర్పాటు చేస్తున్నట్లు పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. అన్ని రకాల పుస్తకాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికి నచ్చిన పుస్తకాలు వారు కొనుగోలు చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ అద్యక్ష కార్యదర్శులు పల్లా కొండల రావు, బోయనపల్లి అంజయ్యలతో పాటు నాదెండ్ల కిషోర్ కుమార్ , లగడపాటి రామారావు , చలమల అజెయ్ కుమార్ , రామన అప్పారావు, మండెపుడి శ్రీనివాస రావు, బ్రహ్మం, ఎల్.గురునాధం, చల్లగుండ్ల శ్రీనివాస రావులు ప్రసంగించారు.


కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? పుస్తకాన్ని ప్రారంభిస్తున్న బాణోతు కొండా

చత్రపతి శివాజీ పుస్తకాన్ని ప్రారంభిస్తున్న దొంతు జ్వాలా నరసింహ రావు.

ఎ.పి.జె అబ్దుల్ కలాం పుస్తకాన్ని ప్రారంభిస్తున్న లగడపాటి రామారావు.

సంతూర్ 100గ్రా. సబ్బుని ప్రారంభిస్తున్న రామన అప్పారావు.

ప్రసంగిస్తున్న డా. నాదెండ్ల కిషోర్ కుమార్.

ప్రసంగిస్తున్న లగడపాటి రామారావు.

ప్రసంగిస్తున్న చలమల అజెయ్ కుమార్.

ప్రసంగిస్తున్న రామన అప్పారావు.

ప్రసంగిస్తున్న మండెపుడి శ్రీనివాస రావు.

ప్రసంగిస్తున్న బ్రహ్మం.

ప్రసంగిస్తున్న ఎల్.గురునాధం.

ప్రసంగిస్తున్న చల్లగుండ్ల శ్రీనివాస రావు.

ప్రసంగిస్తున్న బోయనపల్లి అంజయ్య.
ప్రసంగిస్తున్న పల్లా కొండల రావు.

- పల్లా కొండల రావు.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top