బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?
----------------------------------------------------
చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అను కుని క్షమించి వదలివేసింది అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి కానీ...ధర్మ పరిరక్షణకు సమాజ క్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? (సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళాశంకరుణ్నే తీసుకోండి ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు.బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు.మరి.. ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు? చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం. ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్ తిరుక్కురళ్ను ఎలా లిఖించగలిగాడు? ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా?వశిష్టుడు,వాల్మీకి,కృష్ణుడు,రాముడు,బుద్ధుడు,మహావీరుడు,తులసీదాసు,కబీర్, వివేకానంద... వీరంతా బ్రాహ్మణేతరులే వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా?అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుక బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి గంగాఘాట్ హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుక ు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు (భారత్కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని) సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు కాశ్మీర్ గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు)సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనాకనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు (పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు.
K. Narasimhacharyulu,
Save Hindu Culture!
Save Brahmins!
=================================
for original click HERE
 
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

  1. అర్ధం పర్ధంలేని వాదన!

    ఒక్కసారి పురాణాల్నీ, ధర్మశాస్త్రాల్నీ తిరగేస్తే బ్రాహ్మణులు తమతమ రంగాల్లోకి బ్రాహ్మణేతరులు జొరబడకుండా ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో తెలుస్తుంది. ఈరచయితకు తెలిసిందికూడా తెలియకనా పోతులూరి వీరబ్రహ్మం బ్రాహ్మణుల దురాగతాల్ని ఎండగట్టింది? ఆర్యసమాజమూ, రామ్మోహనరాయ్ పిచ్చివాళ్ళా? లేక నీడలతో పోరాడారా? బ్రాహ్మణులు పాలకులుగా లేకపోతేనేమి రాజుల కాళ్ళు పట్టించుకున్నారు (రామాయణం మరోసారి చదవండి) వాళ్ళకు రాజగురువులుగా ఉంటూ వాళ్ల ఆటలే సాగించుకున్నారు. ఒక నిజాన్ని పదిసార్లు అబధ్ధమన్నంత మాత్రాన అది అబధ్ధమైపోదు.

    మొఘలులు చేసిన దురాగతాలు గుర్తుంచుకోదగ్గవే ఐతే, అంతకు ముందు బ్రాహ్మణులు (అందునా భారయతీయులయ్యుండీ, భారతీయులకు) చేసిన దురాగతాలూ గుర్తుంచుకోదగ్గవే!

    ReplyDelete
  2. శూద్రుల ఇంట బ్రాహమణుడు తింటే.. భూమండలంలో వున్న అశుద్ధమంతా తిన్నట్టే అని జగద్గురువు శ్రీకృష్ణుడే చెప్పాడుకదా!

    ReplyDelete
    Replies
    1. ఎక్కడ చెప్పాడు? ఆధారం చూపగలరా?

      Delete
    2. అది నిజం కాకపోతే ఇప్పటిదాకా మీ బ్లాగును బతకనిచ్చేవాళ్ళా? కొంచెం బిజీగా వున్నాను. త్వరలోనే వీలుచూసుకోని వెతికి చూపిస్తాను.

      Delete



  3. బ్రాహ్మణులకోసం మన పాలకులు ఏం చేయాలి?


    పురమున నివసించు సమస్తప్రాణికోటి హితము కోరేవాడే "పురోహితుడు"గా పేరుపొందాడు.
    ప్రాచీన వ్యవస్థలో, సమాజంలో బ్రాహ్మణులకు గౌరవం, సముచిత స్థానంతోపాటు ప్రాథమిక అవసరమైన జీవనభృతీ పుష్కలంగా లభించేది.

    పౌరోహిత్యం, లేదా దేవాలయాల్లో వంశానుక్రమంగాలభించే అర్చకవృత్తీ, దేవుడిభూముల్లో సాగుపైఆదాయం, హుండీ, ఇతర ధాన్య, వస్తు, వస్త్రకానుకలతో ప్రభుత్వప్రమేయం లేకుండానే బ్రాహ్మణులజీవితాలు గడిచేవి.

    బ్రాహ్మణులు శాకాహారభోజనం, ఆధ్యాత్మికచింతనా, సంస్కృతాదిభాషల, వివిధశాస్త్రాల అధ్యయనాలపట్ల శ్రద్ధా కలిగినవారై వృత్తిలోనిష్ణాతులుగా, నిబద్ధతకలవారుగా - ప్రవృత్తిలో వివాదరహితులుగా, శాంతస్వభావులుగా గుర్తింపబడేవారు.

    ఒకప్పటికాలంలో బ్రాహ్మణులు అగ్రగాములుగా ఉన్న రంగాలేమిటో చూద్దాం!

    - గుళ్ళల్లో అర్చక వృత్తి
    - పౌరోహిత్యం, హోమ, హవన క్రతువుల నిర్వహణ
    - జ్యోతిష్యం
    - పాలకులకు సలహాదారులుగా
    - విద్యారంగం, గురుకులాల నిర్వహణ
    - ఆయుర్వేద వైద్యం, మూలికల పెంపకం, మందుల తయారీ
    - యోగా (ఆసన, ప్రాణాయామ) శిక్షణ
    - పూజాసామగ్రి తయారీ (కొంత స్థాయి వరకు విగ్రహాలు కూడా)
    - అలంకరణ సామగ్రి, పూలమొక్కల సాగు
    - ప్రసాదాల / వంటల తయారీ, పద్ధతిలో వడ్డన
    - ఆధ్యాత్మిక ప్రచురణలు, భగవత్ ప్రవచనాలు
    - లలిత కళలు (సంగీత, నృత్య, శిల్ప, సాహిత్య రచన/కవన రంగాలు)

    కొన్ని దశాబ్దాలక్రితంవరకు కూడా - బ్రాహ్మణకుటుంబాలుపాటించే ఆహార, వ్యవహార నియమాలవల్లనో, ఇతర జెనెటిక్ కారణాలవల్లనో, బ్రాహ్మణవిద్యార్థులు సూక్ష్మగ్రాహ్యులుగా, ఏకసంథాగ్రాహ్యులుగా చదువులలోరాణించి గణిత, రసాయన, భౌతిక, న్యాయ, విద్యా, సాంకేతిక, వైద్యరంగాలలో ఎనలేని ప్రతిభనుకనబరిచి తమతమ సంస్థలకూ, దేశానికీ ఖ్యాతినితెచ్చారు. ఇదంతా ఒక గొప్ప గతం!!

    కానీ - ఇప్పటికాలానికి ఎన్నెన్నో మార్పులు....

    ఈ నాటి ఆధునికయుగంలో, ఉరుకుల-పరుగుల జీవితాల్లో బ్రాహ్మణులకు ఒకప్పటి ఉపాధి అవకాశాలైన రంగాలెన్నింటిలోనో ఇతరులు ప్రవేశించారు. పూజలూ, నోములూ, వ్రతాలూ "సీజనల్" రిచువల్స్ గా తయారైనాయి. హోమాలూ, వేదవిద్యా పరీక్షలంటే ఎవరికీ పట్టదు!

    కాలక్రమేణా వచ్చినమార్పులవల్ల ఈ కాలంలో బ్రాహ్మణులకు సరియైన గౌరవం, సామాజిక స్థానమన్నదే లేకుండా తయారైంది. చదువులు, సీట్లు, ర్యాంకులైనా, ప్రభుత్వ ఉపాధి అవకాశాలైనా "అగ్రకులం" అన్న పేరువల్ల పేద, నిరుపేద బ్రాహ్మణ విద్యార్థినీ-విద్యార్థులెందరో ఉపాధి అవకాశాలను పోగొట్టుకొని, తీవ్రమైన నిరాశకు లోనవుతున్నారు.

    ఐతే - పాలకవర్గాలు, పార్టీలు పట్టించికోని, ఎన్నడూ కులం పేరు చెప్పుకుని రాజకీయనాయకులను "ఫలానా"వి కావాలి అని కోరని బ్రాహ్మణవర్గాలు సైతం, కొన్ని నియోజకవర్గాల్లో "గెలుపు"ను నిర్ణయించగలవారయ్యారు. దాంతో పోటీలు పడి తమతమ మానిఫెస్టోల్లో "బ్రాహ్మణ సంక్షేమ" పథకాల ప్రస్తావన మొదలైంది.

    కానీ, బ్రాహ్మణకులంలోని బీద, కడుబీద కుటుంబాలకోసం ఏం చేస్తే మంచిదన్న విషయంపై ఇంకా విస్తృత అవగాహనకు రావాల్సివుంది.

    ప్రతి జిల్లా కేంద్రంలోనూ, బ్రాహ్మణులకు ఉపాధి కలిగింపగల (దేవాలయాలు, పైన పేర్కొన్న మిగతా రంగాలలో) అవకాశాలగురించి పరిశీలనాధికారిని నియమించాలి. ఒక సమగ్ర నివేదిక తయారుచేయాలి. నివేదిక ఆధారంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

    ఔత్సాహిక బ్రాహ్మణ యువతీ-యువకులకు స్వయం ఉపాధిపథకాలను విస్తరించాలి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top