' గీతపై సుష్మ ప్రకటన - ప్రతి పక్షాల అభ్యంతరం ' అంశంపై మీరేమంటారు?


న్యూఢిల్లీ: భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంధంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరటంతో పాటు దీనిపై లాంఛన ప్రకటనే మిగిలి వుందంటూ ఒక బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భగవద్గీత 5,175వ జయంతి సందర్బంగా ఎర్రకోటలోజరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలుచేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన వామపక్షాలతోపాటు బిఎస్పీ, ఆమాద్మీ పార్టీ, కాంగ్రెస్‌, జనతాదళ్‌ (యు), తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు వాటిని ఖండించాయి. భిన్న మతాల వారున్న మన దేశంలో బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో వున్న వ్యక్తి ఇటువంటి ప్రకటన చేయటం సరికాదని బిఎస్పీ నేత మాయావతి వ్యాఖ్యానించారు. సుష్మ వ్యాఖ్యలు గీతాగ్రంథాన్ని అవమానించటమేనని ఆప్‌ నాయకుడు మనిష్‌ శిశోడియా వ్యాఖ్యానించారు. 'గీత'ను వారు జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలనకుంటే, వారు గీతను అవమానించినట్లే అవుతుందని సిసోడియా పేర్కొన్నారు. సుష్మా వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవని, బిజెపి తన సైద్ధాంతిక వాదాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని సిపిఐ నేత డి రాజా విమర్శించారు. గీతను ఎవరైనా చదవ వచ్చని అయితే ఇటువంటి వ్యాఖ్యలుచేయటం సరికాదని కాంగ్రెస్‌ నేత మనిష్‌ తివారీ విమర్శించారు. గీత గొప్పతనం దాని సారాంశం నుంచి పేర్కొన్నారు. జెడి(యు) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ పిటిఐతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పవిత్ర గ్రంథం ఏదైనా వుందంటే అది రాజ్యాంగమేనని చెప్పారు. పవిత్ర గ్రంథాలన్నిటినీ మనం సమంగా గౌరవిస్తాం అని ఆమె చెప్పారు. జెడి(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌మాట్లాడుతూ సుష్మా ప్రకటన ఉత్తి పనికిమాలినదన్నారు. ఇటువంటి అనవసర వివాదాలను సృష్టించడం మానుకుని పాలనపై దృష్టి పెడితే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు, జపాన్‌ ప్రధాని షింజో అబేకు గీతను కానుకగా ఇచ్చారని, దీనిని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడమే తరువాయి అని సుష్మా పేర్కొంటూ తాజా దుమారానికి తెర తీశారు. 

*Re-published

Post a Comment

  1. గీతతో సహా ఎక్కడ మంచి ఉన్నా తీసుకుని అన్నింటికంటే భారత రాజ్యాంగాన్ని పవిత్రగ్రంధం లా మారిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నాను. ఇది నిరంతర ప్రాసెస్. అయినా మన పార్లమెంటుకు ఎన్నికయ్యేవారి చైతన్యాన్నిబట్టి దాని వేగం ఆధారపడి ఉంటుంది. ఎలాంటి నేతలను ఎన్నుకుంటున్నామనే చైతన్యం ప్రజలలో పెరగడాన్ని బట్టి కూడా ఉంటుంది. మమతాబెనర్జీ వ్యాఖ్యానించినట్లు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే పవిత్రగ్రంధంగా ఉండడం మంచిది.

    ReplyDelete
  2. "పవిత్ర" గ్రంధాలు మతాలకు ఉంటె ఉండొచ్చు కానీ దేశాలకు కాదు. రాజ్యాంగాన్ని ఇలాగే ఉండనివ్వండి.

    ReplyDelete
  3. మమత చెప్పిన పవిత్ర గ్రంథం ప్రజ బ్లాగు లో రాసే వారి ఇళ్లలో అన్నా ఉందాండి? నేనైతే టివిలో తప్పించి ఎక్కడా ఆ పుస్తకం చూడలేదండి. అసలికి భారతదేశంలో 2% ప్రజలన్నా ఆపుస్తకాన్ని కొని చదివి ఉంటారా? భారత ప్రథమ ప్రధాని నెహ్రు చెల్లెలు విజయలక్ష్మి పండిట్ రష్యా రాయబారిగా ఉన్నపుడు, ఆనాటి మేటి కామ్రేడ్ అయిన స్టాలిన్ కలసినపుడు బహుమతిగా ఇచ్చింది. అప్పటినుంచి మొన్న ఒబామా వరకు సందర్భానను సారం భగవద్గీతను బహుమతిగా ఇస్తునే ఉన్నారు. ఏ విదేశి ప్రధాని/అధ్యక్షుడు వాళ్ల రాజ్యాంగాన్ని బహుమతిగా ఇచ్చినట్లు ఎక్కడైనా విన్నారా?

    ReplyDelete
    Replies
    1. ప్రజలో వ్యాఖ్యలు రాసేవారు చైతన్య వంతులని అభిప్రాయం.

      Delete
    2. భగవద్గీతను మీరు ఉదహరించిన వారు బహుమతిగా ఇస్తే జాతీయ పవిత్ర గ్రంధంగా ప్రకటించడానికి అర్హత వస్తుందంటారా? మీరేమి చెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు శ్రీరాం గారు. జాతీయ అన్నప్పుడు దేశ ప్రజలందరికీ ఆమోదంగా ఉండాలి. గీత హిందువులకు పవిత్ర గ్రంధం. మిగతా మతాల వారికి అది అభ్యంతరకరంగా ఉంటుంది. అలాంటప్పుడు నిజంగా గీతమీద గౌరవం ఉంటే దానిని వివాదస్పదం చేయకుండా ఉండాలంటే ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా ఉండడం మంచిది. రాజ్యాంగం ఎందరి ఇళ్లలో ఉన్నదో, గీత ఎందరి ఇళ్లలో ఉన్నదో ఎవరైనా సర్వే చేసి చెపుతారేమో గానీ గీతను హిందువులు మాత్రమే గౌరవిస్తే రాజ్యాంగాన్ని పౌరులందరూ గౌరవిస్తారు. లేదా గీత కంటే ఎక్కువమంది గౌరవిస్తారు.

      Delete
    3. *వివాదాస్పద ప్రకటనలు చేయకుండా ఉండడం మంచిది.*
      కొండలరావు గారు,
      ఈ వివాదాస్పదం అనే మాట, ఈ రోజులో ప్రతిదానికి వాడి వాడి విలువను కోల్పోయింది. ఎమిటి ఇందులో వివాదాస్పదం? అవసరమైతే ఇతరమతాల వారితో చర్చించిస్తారు. ఏకాభిప్రాయం తో నే ముందుకుపోతారు. మీరింకా బిజెపి అంటే హిందువులు మాత్రమే ఆదరించే పార్టిగా అనుకొంట్టున్నట్లుంది. సుమారు 150 మంది ముస్లిం మతపెద్దలు బిజెపి తరపున కాష్మీర్ ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారు. బెంగాల్ లో ఎంతో మంది ముస్లింలు క్యులు కట్టి బిజెపి లో చేరుతున్నారు. తెలుగులో రెండు మూడు బ్లాగులు , హిందు పేపర్ వారు బిజెపి వారికిచ్చే సలహాలను కమ్యునిస్ట్ పార్టికి, సీతారాం ఏచురికి ఇచ్చి, ఆ పార్టిని పునరుద్దరించుకొమ్మనండి.
      రోజు తెల్లారితే హిందూ పేపర్ వారు, బిజెపి వారికి ఉచిత సలహాలు ఇవ్వటం మొదటి నుంచి అలవాటు. ఆ పేపర్ వారు ప్రో చైనా, కమ్యునిస్ట్ కరదీపిక అని కొత్త పాఠకులకు తెలియకపోవచ్చేమో గాని, సీనియర్ పాఠకులకు తెలుసు. కావున వారు బిజెపి కి సలహాలివ్వటం తగ్గించి కమ్యునిస్ట్ పార్టి కి ఇచ్చుకొమ్మనండి. ఆ పార్టిని పునర్నించుకొని అధికారంలోకి రమ్మనండి. వారి భావాలకు తగ్గట్టుగా పాలించమనండి. ఎవ్వరు కాదనరు.
      http://kashmirwatch.com/news.php/2014/12/05/150-clerics-camping-in-kashmir-in-support-of-bjp.html

      Delete
    4. శ్రీరాం గారు,

      ప్రభుత్వం ఏకాభిప్రాయంతో, ఇతర మతస్తులందరిని ఒప్పించి చేస్తుందని మీరు అంటున్నారు. అలా చేస్తారా? లేదా? అనేది వేరు విషయం. ఇక్కడ పవిత్రత అనేది మతాన్ని బట్టి ఏర్పడాల్నా? అది హిందూ మత గ్రంధం ద్వారానే ఏర్పడాల్నా? అనేది నా ప్రశ్న.

      రాజ్యాంగం ఉండగా, దానిని అవసరాల మేరకు మార్చుకునే అవకాశం ఉండగా జాతికి గీతను ప్రత్యేకంగా పవిత్ర గ్రంధంగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది? గీతని హిందువులు మాత్రమే పవిత్ర గ్రంధంగా చూస్తారు. ఇతర మతాలవారు అలా చూడాలని లేదు.

      మీరన్నట్లు అన్ని మతాలవారు అంగీకరించినా దేశానికి ఓ మత గ్రంధంను పవిత్ర గ్రంధంగా ప్రభుత్వం ప్రకటించడం తప్పనేది నా అభిప్రాయం. మతం అనేది వ్యక్తిగత విశ్వాసాల మేరకు మాత్రమే తప్ప ప్రజలందరిపై బలవంతంగా రుద్దాలనుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదు.

      BJP ముస్లిములందరి అభిమానం సంపాదించినా నాకు అభ్యంతరం లేదు. హిందువులు+ముస్లిములు అందరూ కలిపి అంగీకరించినా నా అభిప్రాయం ఈ అంశంపై అదే. మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచాలి.

      ఒకప్పుడు CPM వారు బెంగాల్ లో తిరుగులేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరు చెపుతున్న BJP కంటే జోరుగా ఉన్న ఇందిరా గాంధీని, NTR ను స్వయంగా వారిని కూడా ఓడించిన చరిత్ర ప్రజాస్వామ్యానికి ఉన్నది. BJPకి ఇవ్వాల ఉన్న ఊపు రేపు ఉండకపోవచ్చు. అలా ఉన్నా లేకున్నా దానికి, దీనికీ లింకు ఏమిటో నాకు తెలీదు.

      సీతారాం ఏచూరికి ఏమైనా చెప్పదలచుకుంటే మీరే ఆ పని చేయండి.

      హిందూ పేపర్ సుష్మా ఆ ప్రకటన చేయకుండా గానీ, వక్రీకరించి గానీ ప్రచురిస్తే ఆలోచిద్దాం. కానీ మీరు అలా అనడం లేదు కదా? అన్ని మతాల వారిని ఒప్పించి గీతను పవిత్ర గ్రంధం చేసేస్తాం అంటున్నారు. కనుక హిందూ పత్రిక వ్రాతల విధానం గురించి ఇక్కడ చర్చ అప్రస్తుతం.

      Delete
    5. పవిత్ర గ్రంధం అని మీరు రాస్తున్నరు. ఈ పవిత్ర గ్రంధం అనే పదం తెలుగు చానల్స్ లో చెపుతున్నారేమో! పవిత్ర పదం ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు. బహుశా తెలుగు మీడియాలో అలాచెపుతున్నారేమో! ఎన్నికలు అయిన తరువాత నుంచి టివి చూడటం తగ్గించాను. టివి ని నెలకి 4గంటలు చూస్తే ఎక్కువ. అందులోను తెలుగు వార్తా చానల్స్ చూడాను. ఆ విషయం సంగతి తరువాత.

      *CPM, NTR ను స్వయంగా వారిని కూడా ఓడించిన చరిత్ర ప్రజాస్వామ్యానికి ఉన్నది*

      ఆ రెండు పార్టి లు మీకు గొప్ప కావచ్చు. వాటితో బిజెపి కి పోలికే లేదు. దశాబ్దాల పాటు అధికారం లేకున్నా వేచి చూడగల సత్తా, దేశ ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా తనని తాను మౌల్డ్ చేసుకోగల సామర్థం, నాయకత్వం బిజెపికి ఉంది. రెండు సీట్లనుంచి 272+ సీట్లు తెచ్చుకొన్న చరిత్రా ఉంది. మోడి గురించి దశాబ్దం పైగా మీడీయా మేధావులు వేలగంటలు విషప్రచారం చేసినా పూర్తి మెజారిటి ఇచ్చారు. కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి పెరిగిన ధరలు. మీరు గమనించారో లేదో మోడి అధికారంలోకి వచ్చిన తరువాత ధరలు తగ్గాయి. ప్రజలు చూసేది గుర్తుంచుకొనేది ఇటువంటి అంశాల గురించి. అంతే కాదు గత వారం అవినీతి మీద అంతర్జాతీయ గణాంకాలలో భారతదేశం పది మెరుగు పడితే, చైనా 20స్థానల కిందికి దిగజారింది. వచ్చే ఎన్నికలనాటికి ఇంకా మెరుగుపరచుకొంటే ప్రజలు బిజెపి తప్పక ఆదరిస్తారు. ఒకవేళ తిరస్కరిస్తే ఇంట్లో కూచొంటారు.

      *సీతారాం ఏచూరికి ఏమైనా చెప్పదలచుకుంటే మీరే ఆ పని చేయండి*
      మీరు ప్రజాశాక్తి పేపర్ లో వార్తలు ప్రచూరిస్తే కమ్యునిస్ట్ పార్టి అనుకొన్నాను. కాకపోతే వదిలేయండి. అదేప్పుడో మూలనపడిన పార్టి. హిందువులను అవమానిస్తూ గోల చేయటం తప్పించి, ఆ పార్టి కి చేతనైంది ఎమీలేదు. వాళ్లలో వారే CPI, CPM కొట్టుకొని, ఆరోపణలు చేసుకొంట్టూ పుస్తకాలు రాసుకొంటారు.

      Delete
    6. శ్రీరాం గారు,

      మీరు ఏమి చెప్పదలచుకున్నారో స్పష్టత లేకుండా ఉన్నది. ప్రజాశక్తి లోనూ తెలుగు టీ.వీ చానళ్లలోనూ సుష్మ అనని మాటలు ప్రచార చేస్తున్నారంటున్నారా? అయితే సుష్మ అలా వ్యాఖ్యానించలేదంటున్నారా? ఇంతక్రితం ఇతర మతాల పెద్దలనూ ఒప్పిస్తామన్నారు మరి.

      ప్రజాశక్తిలో మాత్రమే వచ్చి నేను కావాలని లేదా ఇంకెవరో అంటున్నట్లు హిట్లకోసం అయితే వేరు. ఇది దేశ ప్రజల మనోభావాలకు సంబంధించినది. ఒక మత ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చూపాలనే కుట్రపూరిత రాజకీయం. మెజారిటీ లేదా మైనారిటీ ఏ మతపరమైన విషయాలనైనా వ్యక్తిగతమైనవిగా ఉన్నంతవరకూ విభేదించాల్సిన అవసరం లేదు. ఇలా దేశమంతటికీ వర్తింపజేయాలని చూస్తే సమర్ధించకూడదు.

      ప్రజలు ధరలవంటి చిన్న విషయాలు పట్టించుకుంటారు కాబట్టి అధికారంలో ఉన్నవారు అలాంటి చిన్నవిషయాలలో సమర్ధత ప్రదర్శించి ఆ దన్నుతో ఏమైనా చేయొచ్చన్న ధీమా మీ మాటలలో కనబడుతున్నది. ఆ ధీమాలో BJP విజయాలను, వారి వ్యతిరేకుల అపజయాలను చాలా హుషారుగా ప్రకటిస్తున్నారు. ఇక్కడ వాటి ఏకరువుతో పని లేదు. గీతను పవిత్ర జాతీయ గ్రంధంగా లేదా మీరంటున్నట్లు ఏదైనా ప్రత్యేక గ్రంధంగా ప్రభుత్వ పరంగా ప్రకటించడంపై మీ అభిప్రాయం ఏమిటి? అనేది మాత్రమే చర్చకు ఉపకరిస్తుంది.

      మరో అంశం ధరలవంటి విషయాలలో కాంగ్రెస్ ను అసహ్యించుకున్న ప్రజలు వారికి అవసరం లేనివి చేస్తే ఎవరినైనా అసహ్యించుకుంటారని ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుందనే నేను ఇందిర, ఎన్.టీ.ఆర్ వంటి బలమైన నేతలను స్వయంగా వారిని సైతం ఓడించారని చెప్పాను.

      Delete
    7. మీ అభిప్రాయం చదివాను. ధన్యవాదాలు.

      Delete
    8. *ఒక మత ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చూపాలనే కుట్రపూరిత రాజకీయం*
      కొండలరావు గారు,

      భారత దేశంలో హిందువులు ఇతర దేశాల మీదపడి కుట్రలు చేయలేదు, ఎవర్ని నాశానం చేయలేదు. స్వదేశంలో కుట్రలు చేయవలసిన అవసరం హిందువులకు లేదు. వందల సంవత్సరాలు గా హిందూవుల మీద కుట్రలు చేసి చాలా మంది బతుకుతున్నారు.అంతేనా దానిని ఇంకా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు హిందూ మతంలో మాత్రమే లోపాలు ఉన్నట్లు, ఆ ఒక్క మతంలో కులాలు, ప్రపంచంలో ని సాంఘిక దురాచారాలు ఉన్నట్లు ప్రాపగండాను చేసినవారు,పుస్తకాలు రాసిన వారు చాలా మంది ఉన్నారు. వారి దృష్టిలో ఇతర మతాలు మాత్రం కడిగిన ముత్యాలు. ఆనాడు వారు మా తాతల తరాన్ని నమ్మించి ఉండవచ్చు. బాలల హక్కుల ముసుగులో తెల్లవారు చర్చి సహాయంతో చేసిన ఈ కుట్రను చదవండి.

      "అమెరికా ఆమోదించిన బాలకార్మిక నిరోధక చట్టం, 1992ను తయారు చేయడానికి సత్యార్థి సమాచారం అందజేశాడు. 'భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలకార్మికుల వినియోగం వలన సరుకులు తక్కువ ధరకు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిని అమెరికా వంటి ధనికదేశాలు దిగుమతి చేసుకుంటే అక్కడ మాంద్యం ఏర్పడి నిరుద్యోగులు పెరుగాతరని' ఆ చట్టం రెండవ అధికరణలో వుందట. దాన్ని నివారించడానికి ఇండియాలో పరిశ్రమలు తనిఖీ చేసి, అక్కడ బాలకార్మికులు లేరని నిర్ధారణ చేసే అధికారాన్ని ఎన్‌జిఓ (స్వచ్ఛంద సంస్థ)లకు ఆ చట్టం ప్రకారం కట్టబెడుతోంది. రుగ్మార్క్‌కు జర్మన్‌ ప్రొటెస్టెంట్‌లు పెట్టిన 'బ్రెడ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌' ఆర్థిక వనరులు యిచ్చింది. తన వెబ్‌సైట్‌లో 'పేదలకు అనుకూలంగా రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడం మా లక్ష్యం' అని పేర్కొన్న ఆ సంస్థ నిధులతో పలుదేశాలలో చర్చిలు రాజకీయ సమస్యలు సృష్టించినట్లు విక్లీక్స్‌ వెబ్‌సైట్‌ తెలిపిందట. సత్యార్థి తన ఎన్‌జిఓకు రుగ్మార్క్‌ నుండి గుడ్‌వేవ్‌ ఇంటర్నేషనల్‌గా పేరు మార్చారట. ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో అత్యధికులు క్రైస్తవులే, కనీసం యిద్దరు ఫారినర్స్‌ట. భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ తీయడానికై బాలకార్మికుల పేర పాశ్చాత్య కంపెనీలు ఆడుతున్న నాటకంలో సత్యార్థి ఒక పాత్రధారి అని ఆ వ్యాసం చదివితే నాకు అర్థమైంది.

      http://telugu.greatandhra.com/articles/mbs/mbs-satyarthi-satyanveshana-58014.html

      Delete
    9. శ్రీ రాం గారు, హిందువులు కుట్రలు చేస్తున్నారని నేననలేదు. రాజకీయనేతల కుట్ర అని నేనన్నాను. దానికీ దీనికీ తేడా ఉంది. గీతను జాతీయ గ్రంధంగా ప్రకటిస్తే దానికొచ్చే ప్రత్యేక పవిత్రత లేదా గొప్పదనం ఏమీ లేదు. భారత రాజ్యాంగంలో అన్ని మతాలవారికి స్వేచ్చగా తమ భావాలను ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ మేరకు గీతకూ అవకాశం ఉన్నది.

      భారత దేశంపై ఇతర దేశాలవారు దండెత్తారు. భారతీయులు ఇతర దేశాలపై దండెత్తలేదు. అంతే తప్ప హిందువులు అని ప్రత్యేకత ఏమీ లేదు నాకు తెలిసి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండే ప్రత్యేకత స్వాతంత్ర్యానికి పూర్వం నుండే ఉన్నది. ఇప్పటికీ అన్ని మతాల వారు కలిసి ఉండడమే ఎక్కువ. ప్రజలలో ఏ కొద్దిమందో మతోన్మాదులుగా ఉన్నారు. మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు. గీతను జాతీయగ్రంధం చేద్దామనుకోవడమూ, క్రిస్మస్ రోజు సెలవు లేకుండా చేద్దామనుకోవడమూ అలాంటివే.

      ఇక మీరిచ్చిన ఉదాహరణలో పాశ్చాత్య కంపెనీలు మన దేశ ప్రయోజనాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాటిని నిర్ధారించి సరైన చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నించాలి. ఏ మతం విషయంలో అయినా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడమే ప్రభుత్వాలు చేయాల్సిన పని.

      Delete
    10. *బిజెపి విజయాలను, వారి వ్యతిరేకుల అపజయాలను చాలా హుషారుగా ప్రకటిస్తున్నారు.ఇక్కడ వాటి ఏకరువుతో పని లేదు.కాంగ్రెస్ ను అసహ్యించుకున్న ప్రజలు వారికి అవసరం లేనివి చేస్తే ..ఇందిర, ఎన్.టీ.ఆర్ *

      కొండలరావు గారు,
      బిజెపి ని ప్రజలు అసహ్యించుకొంటారో నెత్తినపెట్టుకొంటారో ఐదేళ్ల తరువత సంగతి. ధరలు తగ్గించటం అనేది చిన్న విజయం కాదు. పార్లమెంట్ నుంచి బ్లాగుల వరకు, ఒక అంశంపైన చర్చించాలని మొదలు పెట్టి ఎన్నో ఇతర అంశాలను చర్చిస్తారు, కనుక చర్చలో బిజెపి గురించి నాలుగు మాటలు పాసిటివ్ గా రాస్తే తప్పేమిలేదు. బ్లాగులోకం లో మోడి మీద ఎక్కుగగా నెగటివ్ గా రాయటమే చూస్తూంటం. మన తెలుగువారు ప్రస్తుతం పరిస్థితి మారిందని గురించటంలేదు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం, కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితిలో ప్రస్తుతం తెలుగు వారు లేరు. భవిషత్ లో ఉంట్టుందని అనుకోను. దేశ రాజకీయాలలో తెలుగు వారి రాజకీయ ప్రాధన్యతకి రాష్ట్ర విభజనతో తెరపడింది. దేశంలో ఉన్న ఎన్నో చిన్న రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలు రెండు రాష్ట్రలు అంతే. వీరికి తెరాసా, తెలుగుదేశం, వై.కా.పా. కాంగ్రెస్ తో పడదు, బిజెపి కి సలహాలు ఇచ్చేటంత దృశ్యం లేదనుకొంటాను. అలవాటుకొద్ది అలా ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఒకవేళ ఈమూడు ప్రాంతీయ పార్టిలు కలసి ఒక ఫ్రంట్ గా ఏర్పడితే కేంద్ర రాజకీయాలపై ప్రభావం చూపగలరు. కాని అది జరిగే పని కాదు గదా! తెలుగువారికి ఎంత రాజకీయ చైతన్యం ఉన్నా,విశ్లేషణలు చేసిన 20 మంది యం.పి.లతో చేయగలిగింది ఎమీలేదు. చివరిగా మోడి కి విజయం తలకెక్కలేదు కనుక తెలుగుదేశం పార్టివారికి మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ పార్టికి ఒక మంత్రిత్వ శాఖను ఇచ్చాడు. ఒకవేళ మోడి ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టివారు చేయగలిగింది ఎమీ లేదు. ఇందిర, ఎన్.టీ.ఆర్ ల తో మోడీకి పోలికే లేదు.

      Delete
    11. బిజెపి హిందుత్వకు గల సంబంధం మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకొంటాను. భారతదేశంలో బిజెపి తప్ప ఏ ఇతర రాజకీయ పార్టి హిందువుల గురించి మాట్లాడదు. హిందువుల రాజకీయ ఆంక్షలు ఆపార్టి మేనిఫెస్టో లో ఎన్నో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ ఇంగ్ళిష్ మీడియా పేపర్ ఎదీ తీసి చదివిన ఆ పార్టి పేరు రాసేముందు "హిందూ నేషనలిస్ట్ పార్టి బిజెపి" అని రాస్తారు. మీరు హిందువులు కుట్ర చేస్తున్నరని రాయలేదు అని అనోచ్చు. కాని జాతీయ,అంతర్జతీయ మీడీయాలలో ధ్వనించే అర్థం మాత్రం అదే.

      *హిందువులు అని ప్రత్యేకత ఏమీ లేదు నాకు తెలిసి.*
      మీరు ప్రత్యేకత లేదు అన్నంత మాత్రాన సరిపోతుందా? ఏ ప్రత్యేకత లేకపోతే హిందుస్థాన్ మీద ఇన్నేళ్లు గా అన్యులు దురాక్రమణలు చేశారు. ఇంకా వ్యాపారం చేయాలని ఉవిళ్లూరుతున్నారు . మీకు చాలా తెలియదని తెలిసింది. వీలున్నపుడు చర్చించుకొందాములేండి.

      *పాశ్చాత్య కంపెనీలు మన దేశ ప్రయోజనాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తే .. ప్రయత్నించాలి. *
      కంపెనీలు ఎమి ఈ దేశం లో పెట్టుబడి పెట్టలేదు.వారిపై భారత ప్రభుత్వం ఎలాచర్య తీసుకోగలదు?

      Delete
    12. శ్రీరాం గారు,ధరల గురించి ప్రజలు ఐదేళ్ల తరువాత చెప్తారని నేను చెప్పిందే మీరూ అదే చెప్తున్నారు.సంతొషం. BJP విజయాల గురించి పాజిటివ్ గా వ్రాయాలనుకుంటే ఆధారాలతో సహా ఆర్టికల్ వ్రాసి పంపండి. ఏ విషయం చర్చించేటప్పుడు ఆ మేటర్‌కు పరిమితమైతే ఉపయోగకరంగా ఉంటుంది. అనవసరమైనవి అవి ఎంత గొప్పవైనా ఇక్కడ విసుగుగా ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం.

      2,3 బ్లాగులు తప్ప మిగతా అంతా మోడీని మోసేస్తున్నారని ఇంతక్రితం చెప్పి ఇప్పుడేమో మోడీ గురించి ఎక్కువ నెగిటివ్ గా వ్రాస్తున్నారంటున్నారు.ఇతర పార్టీల తప్పిదాలపై ఆధారాలతో ప్రశ్నలు పంపితే ప్రజలో పబ్లిష్ చేయకపోతే మీరు విమర్శ చేయవచ్చు.

      BJP కే కాదు ఎవరికైనా సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన తెలుగు బ్లాగర్లు చాలా మంది ఉన్నారు. మీ వ్యాఖ్య పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. మోడీ లేదా BJP ఏమీ ఈ దేశ రాజకీయాలను శాశ్వతంగా శాసించగలిగినవి కావు. కాంగ్రెస్ కూడా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీగా కలకాలం ఉంటుందని కలలు కన్నదే. కమ్యూనిస్టు దేశాలు కుప్పకూలి పోయాయి చాలా మన కళ్ల ముందే. కొద్దిపాటి విజయాలకి శాశ్వతం అనుకోవడం విజయగర్వం తలకెక్కడమే అవుతుంది ఎవరికైనా.

      ఇందిర, NTR లతో మోడీకి పోలికే లేదని మీరనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజలు శక్తివంతమైన నేతలనైనా వ్యక్తిగతంగా కూడా వారిని సైతం ఓడించారు. నెత్తిన పెట్టుకున్నవారినే నేలకూలుస్తారని, ఇది మోడీకైనా ఇంకెవరికైనా వర్తిస్తుందనే నా అభిప్రాయం.

      తెలుగుదేశం, BJP ల మంత్రి పదవుల గురించి ఇక్కడ చర్చ అనవసరం.

      ఏ మతమైనా మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. ప్రజలు మతాన్నే పట్టించుకుంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డిని, ఇప్పుడు జగన్ ను, కేంద్రంలో సోనియాను ఆదరించేవారే కాదు. ఎందుకంటే మన రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కువమంది హిందువులే అని అభిప్రాయపడుతున్నాను. వై.ఎస్, సోనియా లు క్రిష్టియన్లు . మారి వారిని హిందువులు ఆదరించలేదా?

      ప్రజలు మతాన్నీ,రాజకీయాలను కలిపి చూడడం లేదు. ప్రజలు మతం విషయంలో అవసరమైన వరకే ఉంటున్నారు. మతోన్మాదులే దానిని రెచ్చగొట్టి రాజకీయాలకు వాడుకోవాలని కుట్రలు చేస్తున్నారు. అది మెజారిటీ మతోన్మాదమైనా, మైనారిటీ మతోన్మాదమైనా మతాన్ని రాజకీయాలకోసం , ఓటుబేంకులకోసం ఉపయోగించుకోవడం సిగ్గుమాలిన చర్య. ఎంత గొప్ప వారు చేసినా ఆ ప్రయత్నాలు ఏవైనా నిరసించాల్సినదే.

      భారతదేశంలో ఏ రాజకీయపార్టీ హిందువులను గురించి మాట్లాడదనేది పొరపాటు. హిందువులను మిగతా పార్టీలు రాజకీయంగా వాడుకోవడం లేదు. బీ.జే.పీ వాడుకోవాలని చూస్తుంది. అదే తేడా. హిందూ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. అవి పాలనాపరంగా రాజకీయ జోక్యంతోనే నడుస్తున్నాయి. హిందువుల పండగలకు కార్యక్రమాలకు రాజకీయ పాలనపరమైన రక్షణతోనే నడుతున్నాయి. హిందూ మత ప్రచారం కు అండగా భారత రాజ్యాంగబద్ధమైన పాలనే రక్షణగా ఉన్నది. హిందువులు అవమానిస్తే దళితులుగా హీనంగా చూడబడ్డవారు కొత్త దేవుడిని వెతుక్కుంటే వారికీ రక్షణగా ఈ రాజ్యాంగమే ఉంటున్నది.

      హిందువుల ఆకాంక్షలు కంటే ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. అలా లేకుంటే ఏ పార్టీ అయినా తప్పు చేస్తున్నట్లే. అన్ని మతాలలాగానే హిందూ మతానికి మత పరిరక్షణ చర్యలు రాజ్యాంగంలో ఉన్నాయి. కాపాడబడుతూనే ఉన్నాయి. అది BJP ఉన్నా లేకున్నా నష్టమేమీ లేకుండానే. బీ.జే.పీ మాత్రమే హిందువులను రక్షించాల్సిన అవసరం అగత్యం లేదు. హిందువులలో లేని ఆకాంక్షలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకోవడం హిందువులందరి ఆకాంక్ష కాదు.

      ఆంగ్ల పత్రికలు ఎలా వ్రాస్తాయి, తెలుగు పత్రికలు ఎలా వ్రాస్తాయి, కమ్యూనిస్టు పత్రికలు ఎలా వ్రాస్తాయి అనేది గతంలో కంటే ఈనాడు ప్రజలకు ఎక్కువగా తెలిసిపోతుంది శ్రీరాం గారు. పత్రికలు ఎవరిని ఎలా సంబోదిస్తారు? ఏ పత్రిక ఎవడి కొమ్ము గాస్తుంది? అనేది కూడా ఈనాడు తేటతెల్లమే. పత్రికలిచ్చేవి సాధికారతను ఇస్తాయంటారా?

      నాకు చాలా తెలియదని నేనే పలుమార్లు చెప్పాను. నాకు తెలిసింది వాదిస్తాను. తెలియంది తెలుసుకుంటాను. నాకు చాలా తెలీదు గనుక వాదించగూడదంటే ఒప్పుకోను. మీరు నిజంగా తెలియజెప్పేవిధంగా వాదిస్తే మీనుండి కూడా నేర్చుకుంటాను. దానికి నేను ఏ మాత్రం న్యూనతకు గురికాను.

      పాశ్చాత్య కంపెనీలగురించి మీరు చెప్పిన ఉదాహరణకు అలా చెప్పాను. ఒకవేళ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ విరుద్ధంగా క్రిష్టియన్లు ఏమైనా చేస్తుంటే చర్యలు తీసుకోవచ్చుకదా? అని నా ఉద్దేశం.

      Delete
    13. కొండలరావు గారు,
      తెలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టి ఉనికి నామ మాత్రం. రోజు బిజెపి ని విశ్లేషిస్తాను, విమర్శిస్తాను అంటే తప్పక రాసుకోవచ్చు. ఆ విశ్లేషణలు ఆపార్టి పై ఓట్ల రూపంలో చూపే ప్రభావం ఉండదని చెప్పటమే ఉద్దేశం.
      మీరు సుదీర్ఘమైన వ్యాఖ్య లో మతోన్మాదం అని ప్రస్తావిస్తున్నారు. మీకు తెలుసోలేదో హిందువులలో మతోన్మాదులు లేరు. కారణం హిందువులకి ఒక మత గ్రంథం, ఒక దేవుడు అనే కాన్సెప్ట్ హిందూ మతంలో లేదు. పక్కదేశాలలో నెలలు,సంవత్సరాల తరబడి హింసించికొంట్టూ జరిగే సంఘటనలు పేపర్లలో చదివితే, మతోన్మాదం అంటే ఎమిటో సామాన్యులకు సైతం ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళ లెఫ్ట్ లిబరల్స్ ప్రచారం చేసిన మతోన్మాద కాన్సెప్ట్ లోని డొల్లతనం అందరికి తెలిసివచ్చింది. హిందువులను ఇతర పార్టిలు కూడా వాడుకోవటానికి ప్రయత్నిస్తే బిజెపి ఎమైనా అడ్డుకొందా? ఇతరపార్టిలు హిందువులను పట్టించుకోలేదంతే. చాలా తేలికగా తీసుకొన్నారు. గత ఎన్నికలలో దేశాన్ని దోచుకొన్నవారందరు ఏకమై, సెక్యులరిజాన్ని అనే ఆదర్శమతంగా, భారతదేశం సూఫిల కర్మ భూమిగా ప్రచారం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు, ఉత్తరాదిన హిందువులంతా ఎకమై బుద్ది చెప్పారన్న విషయాన్ని గ్రహించాలి. అతిగా బిజెపిని విమర్సిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి.

      * హిందువులు అవమానిస్తే దళితులుగా హీనంగా చూడబడ్డవారు కొత్త దేవుడిని వెతుక్కుంటే*

      ఆ రోజుల్లో దళితుల కైతే ఆ కారణం చెప్పారు. మరి నేడు అగ్రవర్ణాలను ఎందుకు మతాంతీకరిస్తున్నట్లు? మతం మారిన తరువాత కొత్త మతంలో వారికి ఎందుకు సముచిత స్థానం కల్పించలేదు?

      అంటరాని కంపు భరించలేక అందులోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?
      http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_15.html

      Delete
    14. కొండలరావు గారు, అమెరికా, యురోప్ వంటి పాశ్చత్య దేశాలన్ని రాజ్యాంగంలో సెక్యులరిజం అని ప్రకటించుకొన్నాయిగదా ! అంతేకాదు ఆ దేశాలలో చర్చ్ లకు పోయెవారు ఎవరు ఉండరు. ఇటలినే తీసుకోండి, ఆ దేశం దివాల తీసి డ్రగ్స్, వ్యభిచారం పై వచ్చే సొమ్ముతో ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఉన్నవారు, మనదేశానికి కోట్ల రూపాయలు పంపించి కన్వర్ట్ చేసే బదులుగా, వారి ప్రజలకు మతం గురించి ప్రచారం చేసి, ఆ డబ్బేదో వారిదేశంలో ఖర్చు చేసుకోవచ్చు గదా! ఈ సెక్యులర్ దేశలవారు వేల కిలోమిటర్లు దాటి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి, మనదేశంలోకి వచ్చి మతాంతీకరణలు చేయవలసిన అవసరం ఏమిటి? సెక్యులర్ అని చెప్పుకొనే, ఆ దేశాల వారు, ఈ దేశంలో మాతాంతీకరణలు చేయటమంటే వారు నిజంగా సెక్యులరిస్ట్ లే నా? మీరే ఆలోచించండి. కారణం తెలిస్తే మీరు చెప్పండి.

      Delete
    15. శ్రీరాం గారు, తెలుగు రాష్ట్రాలలో BJP ఉనికి నామమాత్రమైతే దేశ సమస్యలు తెలుగువారు చర్చించకూడదంటారా? చర్చలకీ ఓట్లు రాలడానికీ సంబంధం లేదు. మతోన్మాదం ఏ ఒక్కమతానికో సంబంధించినది కాదు.

      < హిందువులందరూ ఏకమై .... > అలా జరిగింది కాంగ్రెస్ వైఫల్యం వల్లనే బీ.జే.పీ ని సమర్ధించారు. బీ.జే.పీ విఫలమైతే కాంగ్రెస్ నో మరో పార్టీనో సమర్ధిస్తారు.

      BJP లేకున్నా హిందుమతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. BJP కంటే ముందే హిందూ మతం ఉన్నది.

      దళితులును ఎందుకు ఎవరు గ్రామాల బయట ఉంచారు? అలా చేయడం తప్పా? రైటా? దీనిని నిరోధించడానికి హిందూమతం లేదా BJP ఏమి చేయబోతున్నది చెప్పగలరా?

      మీరు కొందరు వ్రాసిన లింకులు ఇస్తే, వాటికి వ్యతిరేకంగా వ్రాసిన లింకులు మరొకరు ఇస్తారు. కులం-మతం లాంటివన్నీ ఎలా రూపుమాసిపోవాలనేదే ముఖ్యం తప్ప బలవంతంగా వాటిని నిలిపి ఉంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించి చెడుని ఎక్కడ ఉన్నా తొలగించుకుంటూ పోవడమే చేయాల్సినది. నేను వీలయినంత మేరకు అలాంటివి చేస్తాను.

      కావాలని మీరు ఆరోపిస్తున్నట్లు BJP ని టార్గెట్ చేయాలనుకోవడం లేదు. ఎవరికి ఏది బాగా నచ్చుతుందో అలాంటివి చర్చిస్తున్నప్పుడు నాపై ఆరోపణలకు దిగుతున్నారు. ఇది చాలా సందర్భాలలో చూస్తున్నాను. ఇప్పటివరకూ (20.12.2014) వరకూ పల్లెప్రపంచంలో ఉన్న 93 పోస్టులలో ఎన్ని BJP ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి? ఒకరోజు సమయం తీసుకుని మీరే చెప్పండి. లేదా మీ కామెంట్లు విషయం ఉన్నవి ఏవైనా BJP ని సమర్ధించి వ్రాసినవి పబ్లిష్ చేయలేదా? మీరు పంపిన ప్రశ్నలనేమైనా పబ్లిష్ చేయలేదా?

      నిజానికి సోషల్ మీడియావల్ల మోడీ లాభం పొందారు. సోషల్ మీడియా వల్లనే ప్రపంచం మారదు. నిజమైన ప్రపంచం మీడియాకు, సోషల్ మీడియాకు ఆవల చాలా ఉన్నది.

      మతం మీద అభిమానం ఉన్నవారు ఇతరులను ద్వేషించకుండా ఎంతైనా ప్రచారం చేసుకునే అవకాశం మన రాజ్యాంగంలో ఉన్నప్పుడు గీతలాంటి గ్రంధాలకు ప్రత్యేకతలు ఆపాదించాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు గీతను వద్దని బైబిల్ ను నెత్తిన పెట్టుకోరు. కమ్యూనిస్టులకు గతితార్కిక భౌతికవాదం, కేపిటల్ , కమ్యూనిస్టు ప్రణాళికలు ఉన్నాయి. అవి ప్రజల ఆమోదం పొందితేనే సక్సెస్ అవుతాయి. ఇంకో విషయం మీరు ఇలా చాలాసార్లు నిందలు వేశారు. తెలుగువారిలో ఈరోజు BJP బలంగా లేకపోతే ఏకంగా తెలుగు వారినే అవమానించేలా మాట్లాడాలా? BJP కాకుండా ఏ ఇతర మతోన్మాదులు తప్పు చేసినా తప్పనే అనాలి. రాజ్యాంగబద్ధమైన పాలనాంశాలలోకి మతపరమైన అంశాలను వివాదాంశంగా చేర్చడం లేదా అలాంటి ప్రకటనలు బాధ్యత కలిగిన వారు చేయడం తప్పు. దానిని విమర్శించడాన్ని స్వాగతించాలి తప్ప కుంటిసాకులు చెప్పి వక్రమార్గంలో విమర్శించకూడదు.

      నేను బోనగిరి గారు గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించకపోతే నష్టం లేదన్న కామెంట్ ని ఆహ్వానించాను. గీతను ఎవరు వద్దన్నా దానిని నమ్మేవారికి ఇబ్బంది లేదు. ఆ ప్రమాదమూ లేదు.

      విదేశీ నిధులతో బలవంతంగా మతమార్పిడులు జరగడానికి అవకాశం ఇస్తున్న అంశాలు హిందూ మతంలో ఏమైనా ( ఇంతక్రితం నేను చెప్పిన దళితులు లేదా ఇతర కుల కంపు వంటివి ) ఉంటే వారు సరిచేసుకోవాలి. ఎవరు బలవంతంగా మత మార్పిడులు చేసినా తప్పే. ఇక్కడ ఇంకొక విషయం ప్రజలు ఆర్ధిక అంశాలవల్ల అంటే డబ్బుకి లొంగి మతం మార్చుకుంటే అది ఎంతకాలం నిలబడుతుందంటారు? ఆర్ధిక అంశాలు మనిషిని ప్రభావితం చేస్తాయని చెపుతున్నారు కదా? అలాంటి సమస్యలు లేకుండా పాలనా విధానాలు ఉంటే ఆ సంస్యే రాదు కదా? ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు గదా?

      Delete
    16. కొండలరావు గారూ, దేనికయినా కొంత బాలెన్సు ఉండాలి.

      సుష్మా స్వరాజ్ గీతను రాష్ట్రీయ గ్రంధం (పవిత్ర గ్రంధం కాదు) చేయాలన్నది ఒక ఆర్యెస్యెస్ అనుబంధ సభలో. దాన్ని ఆవిడ సొంత అభిప్రాయంగా భావించాలి తప్ప ప్రభుత్వ/భాజపా విధానంగా కాదు. ఆ భావనతో మనం విభేదించడం వరకు మంచిదే కానీ ఆమెకు ఆ హక్కే లేదనలేము. నిరంజన్ జ్యోతి భాజపాకు వోటేయని వారిని అక్రమ సంతానంతో పోల్చడం మల్లె దీనిని తీసుకోలేము.

      మీరు మార్క్సిస్టు పార్టీ సమర్తకులు కనుక ప్రజాశక్తి చదవడం (లేదా 10టీవీ చూడడం) మీ ఇష్టం. ఆ పత్రికలో ముద్రించిన ప్రతి విషయాన్ని సీరియసుగా తీసుకొనే బదులు కాస్త ఇతర ఆధారాలతో చెక్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి.

      గణశక్తిలో (బెంగాలీ భాషలో సీపీఎం పత్రిక) మమతా బెనర్జీ నోటి దురుసు & చేతి వాటం వార్తలు ఎక్కువగా వస్తాయి. ఆవిడ ప్రజాసభలో వాడిన బూతులు & అసభ్య చేష్టలు గణశక్తి ఎండగట్టింది.

      శారదా చిట్ కుంభకోణంలో తృణమూల్ పాత్ర బయటికి రావడం కొంత వరకు గణశక్తి, ఆనంద్ బజార్ పత్రిక వగైరా మీడియా కృషి వల్లే.

      ప్రజాశక్తిలొ ఈ వార్తలు దర్శనం కూడా ఇవ్వవు ఎందుకు? కారణం వెతుక్కోవడం కష్టం కాదు. వాటి మీద కామ్రేడులకు తప్ప మిగిలిన తెలుగు వారికి ఆసక్తి లేదు. వీరిలో పలువురు టీడీపీ /కాంగ్రెస్ మద్దతుదారులు ఉంటారు. పార్టీకి సంబంధం లేని జెనరల్ చదువరులను ఆకర్షించి ఉనుకిని కాపాడాలంటే ఇటువంటి వార్తల బదులు కేంద్ర భాజపాను లక్ష్యం చేస్తే సరి.

      Delete
    17. కొండలరావు గారు, దళితులు వేరే మతంలోకి చేరినా హిందువులు సహిస్తారు కానీ దళితులని తమతో సమానంగా చూడడానికి హిందువులు ఒప్పుకోరు. మతం అనేది ఆర్థిక అంశాలని కదల్చగల స్థాయిలో లేదు. పల్లెటూర్లలో ఇంత మంది మతం మారుతోన్నా, ఆ మతమార్పిళ్ళకి వ్యతిరేకంగా సంఘ్ పరివార్‌వాళ్ళు తప్ప ఎవరూ అరవడం లేదు.

      Delete
    18. జై గారు, సుష్మకు ఆ హక్కే ఉండకూడదని నేననలేదు. మంత్రిగా ఆమె వ్యాఖ్యానిస్తే అభ్యంతరమే. ప్రజాశక్తిలో మాత్రమే ఈ వార్త రాలేదు. నేను చర్చకు ఉంచాక కూడా పలు తెలుగు చానెళ్లలోనూ దీనిపై చర్చ జరిగింది. వివిధ ప్రతిపక్షాల నేతలూ విమర్శించారు. ఇక్కడ అంశం మార్క్సిస్టు పార్టీ సమర్ధుకలకు మాత్రమే చెందుతుందనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. రాజ్యాంగం - పాలన - మతం అనేవి విడివిడి అంశాలే అయినా పాలనలో బాధ్యత కలిగిన మంత్రులుగా ఉన్నవారి మాటలు డెఫినెట్ గా చర్చనీయాంశాలే. ఇప్పుడు శ్రీరాం గారు కామెంట్లకు సమాధానం చెపుతున్నాను. నేను బేలెన్స్ తప్పి పదాలు వాడినట్లు నాకనిపించడం లేదు. మీకనిపించినవి చెపితే ఆలోచిస్తాను.

      ఇక శారదా కుంభకోణం వార్తలూ నేను ప్రజాశక్తిలో చూశాను. కానీ ఏ ప్రాంతం వార్తలు వారికి కాస్త ఇంటరెస్ట్ ఎక్కువగా ఉండడం సహజం. ఇక్కడ చర్చకు ఉంచిన అంశం గీత లాంటి మత గ్రంధాలను దేశం మొత్తానికి ఏ రకంగానైనా అధికారికం చేయాలనుకోవడం తప్పని చెప్పడమే. అది బేలన్స్ తప్పడం కాదు. దేశంలో అన్ని మతాల బేలన్స్ ను నిలబెట్టే ప్రయత్నం అవుతుంది.

      Delete
    19. కొండలరావు గారూ, మీ పదప్రయోగం బాలెన్సు తప్పిందని నేను అనలేదు. విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా బాలెన్సు ఉండాలన్నది నా ఉద్దేశ్యం.

      సుష్మా వ్యాఖ్యను ఇంత సీరియసుగా తీసుకుంటే మరి నిరంజన్ జ్యోతి వాడిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కెసిఆర్ మాటలను తప్పు పట్టేవారు మమతా బెనర్జీ బూతులపై ధ్వజం ఎత్తాలి. ఇవి జరుగక పోవడానికి కారణం ఏమిటి అని అడగడమే నా వ్యాఖ్య ఉద్దేశ్యం.

      మార్క్సిస్టు పార్టీ ధోరణులను/వార్తలను ప్రజాశక్తి హైలైటు చేయడంలో తప్పేమీ లేదు ఎందుకంటే పత్రిక పెట్టిందే పార్టీకి మద్దతుగా. పత్రిక చదివేవారిలో (ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో) టీడీపీ/కాంగ్రెస్/వైకాప సమర్తకులు చాలా మంది ఉన్నారు కనుక ప్రజాశక్తి ఆయా పార్టీలను కాస్త లైటుగా వదిలేస్తుంది అని నా అభిప్రాయం. మీరు ఆ కోణంలో చూసి నేనన్నది తప్పయితే తెలుపగలరు.

      Delete
    20. జై గారు, ఇప్పుడు మీరన్న కోణం అయితే తప్పేమీ లేదు. అయితే ఒక్క విషయం గమనంలో ఉంచుకోవాలి. మీకు అని కాదు ఇది అందరికి విజ్ఞప్తి. ఎవరికి ఏ విషయం ప్రాధాన్యం అనిపించడం లేదా గమనంలోకి రావడం అనేది సమస్యగా తీసుకోవడం సరయినది కాదు. ఎవరికి ఏది చర్చనీయాంశమనిపిస్తే ఆ అంశాన్ని ప్రశ్నగా పంపించే అవకాశం ఉన్నది. ఇక వ్యక్తిగతంగా ఏ నేతను ఏ వ్యక్తినీ టార్గెట్ చేయకుండా లేదా విషయం పక్కదోవపట్టకుండా ఏ విషయాన్ని ఎంతగా చర్చించినా తప్పు లేదు. వివరణకు ధన్యవాదములు.

      ఇక ప్రజాశక్తి ఎవరిని వదిలేస్తుందనేది ఎవరికి కొమ్ము కాస్తుందేనేది నేను చర్చించదలచుకోలేదు. గీతపై ఆ విషయం నేను ఏ పత్రిక చూసినా దానినే రిఫరెన్స్ గా ఉంచేవాడిని.

      Delete
    21. కొండల రావు గారు,
      ఇప్పటికే చాలా రాశాను. మీ మీద నాకు గౌరవం తప్పితే కోపమో, మరోకటో ఎమి లేదు. బిజెపి పార్టిని అన్నివేళల వెనకేసుకు రావటానికి నాకేమి అవసరం లేదు. మీరు చర్చించ కుడదని ఎవ్వరు అనటంలేదు. పైన జై గారు చెప్పినదానితో అంగీకరిస్తాను. మీరు ఒకటి గమనించాలి,బిజెపిని మత విషయాలలో తప్పుపట్టాలని ఇతరులు విమర్సించినపుడు, అదే కొలమానం తో లెఫ్టిస్ట్ లు వెనుకేసుకొచ్చే ఇతర మతాలలో జరిగే సంఘటనలు కూడ పోల్చుకొంటారు. అప్పుడు వారికి వాస్తవం అర్థం అవుతుంది. ఇతరదేశాలలో మతోన్మాదం తో పోలిస్తే, హిందువు సంస్థలు చేసేవి తాటాకు చప్పుళ్ళని. వాటిని భూతద్దంలో చూస్తూ, పాతరోజులలో వలే అలవాటు ప్రకారం లెఫ్ట్ లిబరల్స్ లు హిందువులను విమర్శిస్తున్నారని అనుకొంటారు. ఇది వాళ్ల రిపుటేషన్ కు ఏమాత్రం ఉపయోగపడదు.

      Delete
    22. * బిజెపి లేకున్నా హిందుమతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. *
      ఇది మీ అభిప్రాయం. దానితో ఏఖీభవించను. ప్రస్తుతానికి హిందువులకి బిజెపి పార్టి అవసరం ఉంది అని నా అభిప్రాయం. లక్షల కోట్ల స్కాములు జరుగుతుంటే, దేశంలో ఎవరైనా ముందుకు వచ్చి పోరాడి ఉండవచ్చు. కాని సుబ్రమణ్య స్వామి లాంటి వాడు పోరాడాడు. ఎంతో మంది మేధావులు మీడీయాలో భారత రాజ్యాంగం, చట్టం గురించి చర్చిస్తూంటారు. పోరాడే వారు మాత్రం బిజెపి లో ప్రస్తుతం ఉన్నారు.

      Delete
    23. శ్రీరాం గారు లెఫ్టిస్టులు మతాన్ని వెనుకేసుకొచ్చి రాజకీయాలు చేసినా డెఫినెట్ గా వ్యతిరేకించాల్సిందే. నాకు తెలిసి లెఫ్టిస్టులు ఏ మతాన్ని వెనుకేసుకు రారు. అది వారి సిద్ధాంతానికి వ్యతిరేకం గనుక. మీరలాంటి ఆధారాలు చూపితే లెఫ్టిస్టులైనా ఇంకే ఇష్టులైనా మతాన్ని రాజకీయాలతో లేదా పాలనతో ముడిపెట్టి వ్యవహరిస్తే విమర్శించాల్సినదే. ఇక్కడ నా ఉద్దేశం పాలన అంటే అన్ని మతాలవారు, నాస్తికులు ... ఇలా అందరూ వస్తారు కనుక. వ్యక్తిగతంగా ఏ మతానికి సంబంధం లేనివారు లేదా మతాన్ని అంతగా పట్టించుకోనివారే మనదేశంలో ఎక్కువమంది ఉన్నారని నా అభిప్రాయం. బీ.జే.పీలో పోరాడేవారు లేరని నేను కూడా అనడం లేదు. బీ.జే.పీ హిందు మత పరిరక్షణకు కట్టుబడ్డా ఇబ్బంది లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. మామూలుగా అయినా ఇతర మతాలకు ఇబ్బంది కలిగించకూడదు అన్నదే నా అభిప్రాయం. హిందువులంతా బీ.జే.పీనే సపోర్ట్ చేస్తే అత్యధిక నియోజకవర్గాలలో ఈ దేశంలో ఇతర పార్టీలకు డిపాజిట్ లు కూడా రావు. నా అంచనా అయితే ప్రజలకు మతం కంటే వారి ఆర్ధిక అవసరాలే పాలనా పరంగా ఎక్కువ ప్రభావితం చూపుతాయి. బీ.జే.పీ ఆ దిశగా అడుగులు వేస్తే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారు. మతాన్ని రాజకీయాలలోగి లాగకుండా ఉండడమే మంచిది. ఇక్కడ మతాన్ని నేను విమర్శించడం లేదని మీరు గుర్తించాలి. రాజకీయాలలో లేదా పాలనలో మతాన్ని చొప్పించడం ఎవరు చేసినా అందరం వ్యతిరేకిద్దామని మనవి. మీకు నాపై కోపం ఉందని అనుకోవడం లేదు. సరే ఇక ఈ చర్చను ముగిద్దాము :))

      Delete
    24. లెఫ్టిస్ట్ ల సూక్తి సుధలు అన్ని హిందువులకే. వారు వారిని నిజంగా తటస్థులను కొంటే, పక్క మతస్థులకు కూడా కొన్ని సలహాలు ఇవ్వాలి వారవేమి చేయరు. తప్పులన్ని హిందూ మతంవారి వని ప్రచారం చేస్తార్య్. సెక్యులరిజమనే కొత్త మతం స్థాపించి హిందువులను ద్వేషించటమే పనిగా పెట్టుకొన్నారు గదా! రంగనాయకమ్మ మార్క్స్ వివాహేతర సంబంధాల గురించి ఎమైనా రాసిందా? అతనింట్లో జీవితాంతం పనిచేసిన పనిమనిషికి జీతం కూడా ఇవ్వలేదు, పైగా ఆవిడతో ఒక పిల్ల వాడిని కన్నాడు. దీని గురించి ఆవిడ అభిప్రాయమేమిటని వేణువు బ్లాగులో రంగనాయకమ్మ మహాభారతం టపాలో అడిగితే, ఆయన ప్రశ్నను కూడా ప్రచూరించలేదు. అది వారి నిజాయితి. మరి ఆవిడ శ్రీ శ్రీ నుంచి సీతారామయ్య వరకు, శ్రీ రాముడి ని అందరిని విమర్శించింది. వీరు హిందువులకు సుద్దులు ఎలా చెపుతారు? తండ్రిని జైల్లో పెట్టి, సోదరులను చంపి, వందల సంవత్సరాలు మొగలులు పాలించారు కదా! వారి ప్రభావం భారతదేశంపైన ఎమీ లేనట్లు. అంతా హిందువులే ఇక్కడ రాజ్యం చేసినట్లు రాస్తూంటారు. వారి మీద ఒక చిన్నపది పేజిల వ్యాసం కూడా రాసినట్లు చూడలేదు. అది వారి నిజాయితి. అంతేందుకు పక్కదేశంలో మొన్న స్కూల్ లో జరిగిన సంఘటనకు అమెరికా కూడా కారణం అంట్టు, అపనిందలు వేస్తూ రాసేవారికి బ్లాగులో కొదవలేదు గదా! ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే లెఫ్టిస్ట్ లు వంద కవితలు రెండోందల వ్యాసాలు రాసి ఉండేవారు. వీరి ఓవర్ యాక్షన్ ప్రజలు తిప్పికొట్టినా పట్టించుకోరు. ఇక ఈ చర్చను ముగిద్దాము

      Delete
    25. మతం మీద నమ్మకం లేనివాళ్ళని ఆకర్షించడానికి భాజపా అవినీతి నిర్మూలన పేరు చెప్పుకుంటుంది. విదేశాల నుంచి నల్ల డబ్బు వెనక్కి తెస్తామని చెప్పిన భాజపా ఇప్పటి వరకు ఎన్ని మీనమేషాలు లెక్కపెట్టిందో చూసాము కదా. ఇస్లాం, క్రైస్తవ మతాలలాగ హిందూ మతం organised కాదు. హిందువులలో రెండు కులాలవాళ్ళు కలిసి ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవు. ఈ మతం పేరు చెప్పుకుంటే వోత్‌లు పడవు కాబట్టి భాజపా అవినీతి నిర్మూలన లాంటి పేర్లు చెప్పుకుంటుంది.

      Delete
    26. విదేశాలలో ఎంత నల్లడబ్బు ఉందో లెక్క కట్టి, వాటి గురించి మాట్లడటానికి కూడ కమ్యునిస్ట్ పార్టిలలో మేధావులు కూడా లేరు. అక్కడ అంతా టెంత్ క్లాస్ హానర్స్ చదివి, తర్జుమా పుస్తకాలు రాసేవారే ఆర్ధికవేత్తలు కదా! చెపితే అర్థం కావటానికి,అదేమి అంత చిన్న విషయం కాదు. ఒక కేసుకి 30,000 -40,000 పేజిల డాక్యుమెంట్లు ఉంటాయి. వాటిని చదివి, అర్థం చేసుకొని, నివేదికను చార్టేడ్ అకౌంట్లు తయారుచేసి ఇస్తే, రాంజెట్మలాని, కోర్టులో ఆర్ధిక శాస్రపరిజ్ణానం పెద్దగా లేని వారికి అర్థమయ్యేటట్లు చెప్పి, వాదించి కేసు గెలిచాడు. గత ప్రభుత్వ కాలంలో సుమారు 1000 కోట్ల రూపాయలు వెనుకకు తెప్పించాడు. ఆయన ప్రభుత్వం వెంటపడిన తరువాతే నల్లధనం కేసులో చలనం వచ్చింది. అతనికి గురుమూర్తి, ఇంకా ఎంతో మంది బిజెపి పార్టి లోని ఆర్ధిక నిపుణులు నివేదికలు తయారు చేసి ఇచ్చారు. వాళ్లు అధికారంలో లేనపుడు దశాబ్దాలకు పైగా పోరాడి పోరాడి ఈ మాత్రం డబ్బును తెచ్చారు. దీనివలన రాంజేట్ మలానికి, గురుమూర్తికి కలిగిన లాభం ఎమి లేదు. అది వాళ్లు స్వచ్చందం గా చేశారు. మిగతావారు ఒక లక్ష రూపాయలన్నా తీసుకొచ్చారా? వాళ్ళు పోరాడితే వద్దనేవారు ఎవరు? నల్లధనం గురించి పైసా నాలేడ్జ్ లేకపోయినా తెలుగు పేపర్లలో అది రాదని రాసే వారు చాలా మంది ఉన్నారు. వారు రాసింది చదివితే దానిపై పోరాటం చేసేవారి గురించే వారికి తెలిసినట్లు అనిపించదు. బిజెపి అని రాసేస్తూంటారు. ఒకరైతే నల్లధనం సంగతి పక్కన పెట్టి, పిల్లలే ధనం కనుక ప్రభుత్వం వారిని బాగా పెంచటానికి ప్రయత్నించాలని ఉచిత సలహా ఇచ్చాడు. నల్లధనం వెనుకకు తెస్తామని చెప్పినందుకే దేశప్రజలు ఓటు వేయలేదు కదా! ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంచెం వేచి చూడండి.

      * హిందువులలో రెండు కులాలవాళ్ళు కలిసి ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవు*
      ఈ పసలేని విశ్లేషణలు చాలా మంది చేస్తూంటారు

      Delete
    27. శ్రీరాం గారు,

      వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు వారు చెప్పే విషయాలకు లింకు పెట్టి వాదించడం ఓ రకమైన ఫలాయనవాదం అవుతుందని నా అభిప్రాయం.

      విషయం గురించి మాట్లాడేటప్పుడు అది చెప్పినవారి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి వాదించడం ఏ రకమైన సంస్కారం?

      ఈ భూమి మీద ఒక్క తప్పూ చేయని పవిత్రుడెవరో చెప్పగలరా?

      విషయాన్ని విషయంగా వాదించలేమా?

      మీరన్న ఆరోపణలలో మార్క్స్ పై మీరు చెప్పినవాటికి ఆధారాలు చూపగలరా? ఎందుకంటే కాంగ్రెస్ నేతలు 1952 ప్రాంతంలో సుందరయ్యమీదనే ఇలా వెంగమాంబ అనే వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టి దుష్ప్రచారం చేశారట. మీరనేదీ అలాంటిదేనా? లేక ఆధారాలు చూపుతారా? నాకు తెలిసి మార్క్స్పై మీరన్న ఆరోపణలు నిరాధారమైనవి. నేనైతే వినలేదు.

      మార్క్స్ జీవితానికీ - మార్క్స్ రచనలకూ లింక్ పెట్టాల్సిన అవసరం ఎందుకు? మార్క్స్ రచనలను విమర్శించవచ్చు. మార్క్స్ జీవితాన్నీ విమర్శించవచ్చు. కానీ ఎలా? ఆధారాలతో, అవసరం మేరకు మాత్రమే.మీకింకో సూచన వేణువు బ్లాగులో మీ కామెంట్ పబ్లిష్ కాకపోతే మీరు వేణు గారికి మెయిల్ వ్రాసి వివరణ అడగవచ్చు.

      Delete
    28. *మార్క్స్ జీవితానికీ - మార్క్స్ రచనలకూ లింక్ పెట్టాల్సిన అవసరం ఎందుకు?*
      కొండలరావు గారు,
      శ్రీశ్రీ ,సీతారామయ్య వ్యక్తిగత జీవితం వారు విమర్శించలేదా? సమాజాన్ని ప్రభావితం చేసిన వారి వ్యక్తిగత జీవిత ప్రస్థావన,ఎదో ఒక సందర్భంలో రాక తప్పదు. పాతకాలం నాటి ఏ పుస్తకం చదివిన మార్క్స్ వ్యక్తిగత జీవితం చాలా అద్భుతమైనట్లు, ఒక హీరో వర్షిప్ తో, ఆయన ప్రజలకొరకు జీవితం త్యాగం చేసినట్లు తెలుగులో లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు. మీరు వాటిని చదివే ఉంటారు. కాని వాస్తవం వేరు.ప్రపంచం మీద మార్క్స్ ప్రభావం ఉండవచ్చు. ఒప్పుకొంటాను. ఆయనకి శ్రీ శ్రీ కి ఉన్న వ్యసనాలన్ని(మందు,మగువ) ఉన్నాయి. ఇక ఆవిడ ఒక పుస్తకంలో మార్క్స్ ని ఋషి అంటూ సంభోదించినట్లు గుర్తు. రచయితగా సుదీర్ఘ కాలం కొనసాగుతూ, ఎంతో మంది లోపాలను ఎత్తి చూపుతూ, ప్రస్థావించిన వారికి మార్క్స్ గురించి ఈ లోపాలు తెలియకుండా ఉంటాయా? దానిపై ప్రతిస్పందన ఎమిటి? అని తెలుసుకోవటమే ఉద్దేశం.

      *మీరన్న ఆరోపణలలో మార్క్స్ పై మీరు చెప్పినవాటికి ఆధారాలు చూపగలరా?*

      చూపిస్తే ఎమి చేస్తారు?

      *వేణువు బ్లాగులో కామెంట్ పబ్లిష్ కాకపోతే ...వ్రాసి విరణ అడగవచ్చు.*
      మీ సలహాకు ధన్యవాదాలు. ప్రస్తుతం నాకాసక్తి లేదు. ఆ రోజు, ఆ ప్రశ్న అతన్ని అడగటానికి కారణం ఆ టపా చదివిన వెంటనే, ఇంత వృద్దాప్యంలో కూడా ఒకటికి మూడు పెద్ద హిందు గ్రంథాలను చదివి, ప్రతి పాత్రని విమర్శిస్తూ ఓపికగా, దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా రచనలు చేస్తున్నాది కదా! మరి మార్క్స్ గారి లోపాలను ఆవిడ ప్రస్థావించిదా? అని ఆసక్తి కొద్ది అడిగాను. ఆయన దానినికే కోపం వచ్చినట్లుంది.
      *ఫలాయనవాదం,ఏ రకమైన సంస్కారం?*
      ఈ పెద్ద మాటలకి వివరణ ఇచ్చే ఓపిక, సమయం లేదండి. తెలిసిన నిజాలు రాశాను. అందరిని ఒప్పించాలని కాదు.

      Delete
    29. కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం
      http://naprapamcham.blogspot.in/2007/06/blog-post.html
      http://naprapamcham.blogspot.in/2007/07/blog-post_15.html
      http://naprapamcham.blogspot.in/2007/07/2_23.html
      http://naprapamcham.blogspot.in/2007/07/3.html
      http://naprapamcham.blogspot.in/2007/08/4.html
      http://naprapamcham.blogspot.in/2007/12/5.html
      http://naprapamcham.blogspot.in/2007/12/6.html

      మీకు ఇంగ్లిష్ అలవాటు లేదని ఈ లింక్ లు ఇస్తున్నాను. ఇది నమ్మకపోతే చెప్పండి. ఇంగ్లిష్ పుస్తకం పేరు, పేజినంబర్ తో సహా ఇస్తాను.

      Delete
    30. < చూపిస్తే ఏమి చేస్తారు? > తెలుసుకుంటాను. మీరు ఆరోపణ చేశారు కనుక నేను ఆధారం అడిగాను. నాకు తెలిసినంతవరకూ మీరు చెప్పేది అబద్దం. లేదా మీకు తెలిసింది అబద్దం. అబద్దాన్ని నిజంగా ప్రచారం చేయకూడదు కదా? అందుకే ఆధారం అడిగాను? ఉంటే చెప్పండి.

      రంగనాయకమ్మ గారు కేపిటల్ పరిచయం రచనలో ఆ మాట వాడారు. కేపిటల్ రచన అద్భుతమే. నేనామె వ్రాసినది చదివాను. పెద్దగా అతిశయోక్తి అనిపించలేదు. ఋషి అంటే అర్ధం ఎవరు ఎలా అన్వయించాలనేది ఏమి రూల్ లేదు కదా? శ్రమ దోపిడీ అనే విషయాన్ని మార్క్స్ అద్భుతంగా చెప్పగలిగాడు కనుక ఆమే కేపిటల్ చదివి తెలుగులో పరిచయం చేశారు కనుక ఆమెకు కలిగిన అభిప్రాయాన్ని తెలపడంలో తప్పేముంది?

      అదే కేపిటల్ లో నచ్చని అంశాలను వివరణలతో ఎంతైనా విమర్శించవచ్చు.

      ఇక్కడ వ్యక్తిగత జీవితాలను అసలు విమర్శించవద్దనీ, ప్రస్థావనకే వద్దనీ నేను అనలేదు. నా కామెంట్ మరోసారి చూడండి. దేనికదే చూడాలీ అంటున్నాను.

      Delete
    31. వాస్తవానికి ఎవరు ఎవరితో తిరిగినా నాకభ్యంతరం లేదు. కాని తెలుగులో వాదాల/ఇజాల సాహిత్యం రాసేవారు, నిజాలు మాత్రం రాయరు. దశాబ్దాలుగా అబద్దాలు ఎలా రాస్తారో వారికే తెలియాలి. హిందూ మత గ్రంథాలలోని పాత్రలను శృతిమించి విమర్శిస్తారు. కొత్త అంశం కనుకొన్నట్లు గొప్పగా ఫీలౌతారు. అదేదో 1965-85 కాలంలో రాశారంటే తెలియకో, ఆర్ధికంగా బతుకు ఈడ్చటం కష్టం గా ఉన్నరోజులో సమాజంపై కోపంతోనో అని సరిపుచ్చుకోవచ్చు. కాని ఇప్పటికి వారు హిందు గ్రంథాల లోని పాత్రలు మాత్రమే కక్ష కట్టినట్లు,కసికొద్ది, ఒక్కొక్క వాక్యాన్ని పట్టి పట్టి వారిలోణంలో నుంచి మాత్రమే చూస్తూ, విమర్శిస్తూ అదే పంథాను కొనసాగిస్తూంటే ఏమనుకోవాలి?

      Delete
    32. శ్రీరాం గారు, మీరిచ్చిన లింకులతో పాటు ఆ బ్లాగులోని "కారల్ మార్క్స్‌కు కమ్యూనిస్టులు పట్టించిన ముగింపు" ( http://naprapamcham.blogspot.in/2007/12/blog-post.html ) అనే వ్యాసం కూడా చదివాను.

      నాకు తెలిసి ఇంత ఓపికగా వరుసగా ఏకబిగిన నేను చదివినవి ఇవే. మూడు విషయాలు చెప్పదలచుకున్నాను. 1) ఇవి చదివాక మార్క్స్ పై నాకు మరింత గౌరవం పెరిగింది. 2) కమ్యూనిస్టులు దాచేస్తే ఇన్నయ్యగారు ఎలా శాస్త్రీయ పరిశోధన చేయగలిగారు. ఇన్నయ్య గారు వ్రాసినవాటి ఆధారాలు కూడా చెపితే బాగుండేది. 3) నేను కూడా బద్ధకం వదిలించుకుంటే చదవగలను.

      ఇకపోతే మార్క్సిజంపై ఆ బ్లాగులోనే చెప్పినట్లు 1) వ్యతిరేక దృష్టి 2) అంధ విశ్వాసం 3) విశ్లేషణాయుతమైన విమర్శ అనే మూడింటిలో నేను మూడోదానిని సమర్ధిస్తాను. మరి ఆ రకంగా చూస్తే మీరిచ్చిన లింకుల వ్యాసాలు చదివాక నాకు మార్క్స్‌పై మరింత గౌరవం కలిగింది. ధన్యవాదములు.

      ఇక హిందూ మతగ్రంధాలపై విమర్శ గురించి : నాకు తెలిసినంతవరకు మార్క్స్ (ఏంగెల్స్) మతం పై దాడి చేయొద్దనే చెప్పాడు. మతం మత్తు మందులాంటిదని చెప్పారు. మత్తు మందు అంటే ఆపరేషన్ చేసే సమయంలో నొప్పి లేకుండా చేసేది. దానివల్ల ఉపయోగమే. మతం కూదా మనిషికి చాలా విషయాలలో భ్రమాత్మక ఆనందం ఇస్తుంది. అయితే అసలైన ఆనందం ఎలా వస్తుందో తెలుసుకోగలిగిన వారికి మతం అవసరం లేదు. మతం అవసరం ఉన్నవారికి మతాన్ని వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నవారిని టార్గెట్ చేసి విమర్శించడం మార్క్సిష్టు కోణమని ఎవరైనా చెప్పుకుంటే అది మార్క్స్ తప్పు కాదని నా అభిప్రాయం.

      ఇక ఇక్కడ అసలు పోస్టులో గీతను కూడా హిందువులు పవిత్రగ్రంధంగా చూసుకోవడం వరకూ, ప్రచారం చేసుకోవడం వరకూ తప్పు లేదు. ఎవరికీ అభ్యంతరం కూడా ఉండకూడదు. హిందువులు కాని వారు, లేదా నాస్తికులు లేదా సైన్స్‌ను నమ్మేవారు ఎవరైనా గీతలోని ఆచరణకు పనికివచ్చే మంచి విషయాలు వరకూ గ్రహిస్తే తప్పు లేదు. ఏ మత గ్రంధమైనా దేవుళ్లు స్వయంగా చెప్పారనో, వ్రాశారనో నేను అనుకోవడం లేదు. మనుషులే దేవుని పేరుతో వ్రాశారు. అందులో ఆయా కాలాల జీవన విధానం , మానవ చైతన్యం ఆధారంగా నిజాలు కొన్ని, ఊహలు కొన్ని, అద్భుతాలు కొన్నీ ఉంటాయి. వీటిలో పనికివచ్చేవి ఉంటే మానవ సమాజం గ్రహిస్తుంది. పూర్తిగా నమ్మేవారు భక్తితో వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తారు. కానీ గమ్మత్తేమిటంటే భక్తులు కూడా మతగ్రంధాలలోని విషయాలను యథాతధంగా అనుసరించలేరని నా అభిప్రాయం. ఇలాంటివి పూర్తిగా వ్యక్తిగతం. అలాంటివాటిని అలా ఉంచితేనే వాటికి గౌరవం ఉంటుంది. అనవసరంగా లేదా బలవంతంగా సమాజంలో అందరికీ రుద్దేలా చర్యలు, ప్రతిపాదనలు, ప్రచారాలు అనవసరం. ఈ పోస్టుకు సంబంధించి ఇంకా వాదనలు అనవసరమని అభిప్రాయపడుతున్నాను.

      Delete
    33. మీకు గౌరవం పెరిగితే ఆయన పటానికి పూలదండవేసుకొని పూజించుకొన్నా నాకేమి అభ్యంతరంలేదు. ఇక మీరేండవ పాయింట్ కమ్యూనిస్టులు దాచేస్తే ఇన్నయ్యగారు ఎలా శాస్త్రీయ పరిశోధన చేయగలిగారు. ఇన్నయ్య గారు వ్రాసినవాటి ఆధారాలు కూడా చెపితే బాగుండేది. నాకు ఇన్నయగారి గురించి ఎమితేలియదు. ఆ బ్లాగు లింక్ ఇవ్వటానికి కారణం అది తెలుగులో ఉండటమే. కాకపోతే మీరు ఇన్నయ్య గారు వ్రాసినవాటి ఆధారాలు కూడా చెపితే అని అంట్టున్నారు. మార్క్స్ రాసిన థియరిలో ఎన్నో అవస్తవాలు ఉన్నాయని, ఆయన ఇచ్చిన ఆధారాలు సరిగాలేవని, తన థియరికి ఉపయోగపడేవి పేర్కొన్నాడని పరిశొధనలు చేసినవారు ఎప్పుడో తేల్చారు. ఆ పత్రాలన్ని ఇంగ్లిష్ లో ఉంటాయి.విదేశాలలో యునివర్సిటిలలో ఆర్ధిక శాస్రం చదివేవారికి కంపేరిటివ్ స్టడి చేస్తారు. వాటి గురించి చాలా మందికి తెలుసు. నన్ను ఇన్ని ఆధారాలు అడుగుతున్నారు.ఎందుకు? నాకేమి మార్క్స్ పెళ్ళాన్ని నెత్తిన ఇంటిభారం మోపి,మూడొచినపుడు పగలు రాత్రి పనిచేసి, ఉత్త సమయాల్లో తాగి,ఇంట్లో ఖాళిగా కూచొని, పగటికలలు కనేవాడని చెప్పి మిమ్మల్ని నమ్మించవలసిన అవసరం ఎమీలేదు. నన్ను సాక్షలు అడుగుతున్నారే, ఎంతమంది వాదాల/ఇజాల రచయితలు ఆధారలతో తెలుగులో పుస్తకాలు రాశారబ్బ. సాహిత్యం సృష్టించేవారు ఆధారాలు, రెఫెరెన్స్ లు ఇచ్చి పుస్తకాలు రాసినట్లు గుర్తులేదు. ఇక మార్క్స్ విషయం లో ఆధారాలు కావాలంటే ఇన్నయ గారు ఏ పుస్తకం చదివి, అదిరాశారో నాకు తెలియదు గాని, నేనుమాత్రం ఇంటేలెక్ట్యువల్స్ అనే పుస్తకం పాల్ జాన్సన్ అనే బ్రిటిష్ రచయిత ఎంతో మంది గతశాతాబ్దం లో వారి సమాజాన్ని ప్రభావితం చేసినవారిని గురించి రాశాడు. అందులో మార్క్స్ ఒకడు. అది కొనుకొని చదువుకోండి.

      మీకు మార్క్స్, దానిని తెలుగు లో అనువదించినవారు గొప్ప వారు కావచ్చేమో! నా వరకైతే మార్క్స్ కన్నా భారతదేశంలో ఎంతో మంది నాయకులు చాలా ఉన్నతులని అభిప్రాయం. ఇప్పుడు రాసిన వ్యాఖ్యలకి గీత ku ఎమి సంబంధంలేదు. మీరు దాని గురించి ఎందుకు మళ్ళి మళ్ళి ప్రస్త్వావిస్తున్నరో అర్థంకావటంలేదు.

      Delete
    34. *కమ్యూనిస్టులు దాచేస్తే ఇన్నయ్యగారు ఎలా శాస్త్రీయ పరిశోధన చేయగలిగారు.*
      రాయటం మరచాను, మానవ వాదం బ్లాగును ఇన్నయ గారు నడుపుతున్నరు ఆయనని ఆధారాలు అడగండి. చెపుతారేమో!

      Delete
    35. శ్రీరాం గారు, నేను మిమ్ములను కూడా గౌరవించే చర్చిస్తున్నాను. మరి మీకు దండవేయమంటారా? పూజించమంటారా? పూజించమని మార్క్సిజంలో చెప్పరు. మార్క్స్ కూడా తాను చెప్పినదానిలో పనికివచ్చేవి తీసుకోమన్నాడు. ప్రతీదానిని శంకించి ప్రశ్నించి నిర్ధారించుకోమన్నాడు. మీకు ఇన్నయ్యగారి గురించి తెలీదంటున్నారు. మార్క్స్ పై నిందలు వేయడానికి ఆయనను ఉపయోగించుకుంటున్నారన్నమాట. ద్వేషపూరిత ప్రచారం కంటే విషయాల ఆధారంగా మార్క్స్‌నీ, మార్క్స్ వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తే ఉపయోగం తప్ప ఇలా వ్యాఖ్యానించడం వల్ల ఉపయోగం లేదు. నేను మీరిచ్చిన లినుకులన్నీ అదనంగా ఒకటి కలిపి చదివి అందులో మార్క్స్ జీవితాంతం కష్టాలు పడుతూ మనిషిని పరిపూర్ణుడిగా చేయడానికి కృషి చేశాడని ఇన్నయ్య గారు వ్రాశారు. అలాంటప్పుడు మార్క్స్ పై గౌరవం పెరగడమే జరుగుతుంది. మరి మీకెందుకు కలగలేదో? నాకెందుకు ఆ లింకులు ఇచ్చారో అర్ధం కాలేదు. ఇన్నయ్య గారి లింకులు ఇచ్చిందీ, వాటిని నమ్మి ప్రచారంలో పెట్టాలనుకున్నది మీరే గనుక మీరే వాటి ఆధారాలు తేల్చాలి. నాకా అవసరం లేదు. మార్క్స్ వ్యక్తిగత జీవితం గురించి నాకనవసరం. విషయం ఆధారంగా చర్చలుంటే మంచిది తప్ప అనవసరమైన చోట ఏ వ్యక్తి జీవితం గురించైనా నిరాధారంగా చర్చిండం మంచి సంస్కారం కాదు. నేనెప్పుడూ ఎవరికి ఇలాంటి లింకులు రిఫరెన్సుగా ఇచ్చి చూడండని చెప్పలేదు. మీరిచ్చినప్పుడు మిమ్ములనే అడుగుతారు. అలా చెప్పలేనప్పుడు అసహనం వ్యక్తం చేయడం అనవసరం. ఇంగ్లీషు రాకపోయినా తెలుగులో చెప్పవచ్చు కదా? ఈ రోజు మీరిచ్చిన లింకులు చదువుతుంటే మార్క్స్ కు కూడా మొదట ఇంగ్లీషు రాదని ఏంగెల్స్ ద్వారా ఇంగ్లీషులో ఆయన రచనలు పత్రికలలో అచ్చయ్యేవని చదివాను.

      Delete
    36. మార్క్స్ కంటే ఇండియాలో గొప్పవారు లేరని నేననడం లేదు. ఇక్కడ ప్రశ్న గీత గురించి అయినప్పుడు దానిగురించి మాట్లాడిముగిద్దామని మళ్లీ చెప్పాను. మార్క్స్ చెప్పినవాటిలో పనికి వచ్చేవి స్వీకరించవచ్చు. పనికిరానివాటిని కారణాలు చెప్పి తిరస్కరించవచ్చు. లేదా అసలు మార్క్స్ చెప్పినవాటితో పనిలేకుండా కేవలం ఇండియాలో మీరనుకుంటున్న గొప్పవారినే ఆదర్శంగా తీసుకుని పని చేయవచ్చు. ఆ స్వేచ్చ మీకున్నట్లే మార్క్స్ బోధనలను అధ్యయనం చేసి మంచి చెడులను స్వీకరించే అధికారం ఇతరులకూ ఉంటుంది.

      Delete
    37. మాలిక వ్యాఖ్యల సెక్షన్ లో మూడు కామెంట్లు మీరు రాసీనవి కనిపిస్తున్నయి, ఇక్కడ రెండు మాత్రమే గుర్తించగలిగాను. *మార్క్స్ పై నిందలా? * మీరు ఈ క్రింది పేరా ను చదివారా? లేదా? అది మీకు తప్పుగా అనిపించలేదా?
      "లండన్ లో ఉండగా మూర్ కు (మార్క్సును ఇంట్లో ఆప్యాయంగా పిలిచే పేరది. లండన్ లో 28 డీన్ స్ట్రీట్ లో మార్క్సు ఇంట్లోనే ప్రసవించింది. అతని పేరు ఫ్రెడరిక్....జెన్నీ కూడా తన స్వీయ గాథలలో స్థాలీ పులాక న్యాయంగా ఈ విషయాన్ని ప్రస్తావించక పోలేదు"
      http://naprapamcham.blogspot.in/2007/12/6.html

      *మీకు ఇన్నయ్యగారి తెలీదంటున్నారు... ఉపయోగించుకుంటున్నారన్నమాట*
      ఇన్నయ్యగారిని నేను ఉపయోగించుకొనేది ఎమిటో నాకర్దం కాలేదు? అంతకన్న ఘోరంగా మార్క్స్ గురించి ఇంగ్లిష్ లో రాసినది చదివాను. ఇన్నయగారు ఆకాలంలో తెలుగులో రాశారు కనుక చాలా సాఫ్ట్గా రాశారు. రంగనాయకమ్మ పుస్తకాలు చదివాను. రేపు ఎదైనా అవసరమనిపిస్తే ఆమే రాసింది కోట్ చేస్తే అది ఉపయోగించుకోవటమేనా? లింక్ ఎందుకిచ్చానన్న మీప్రశ్నకు పైన చర్చలో నే సమాధానం ఉంది. చదువుకోండి. చాలా వ్యాఖ్యలు ఉన్నందువల్ల, నా బ్రౌసర్ లో స్క్రోల్ చేయటం కష్ట్టంగా ఉంది.

      *అనవసరమైన చోట ఏ వ్యక్తి జీవితం గురించైనా నిరాధారంగా చర్చిండం మంచి సంస్కారం*
      నేనేమి నిరాధారంగా ఆరోపణలు చేయలేదు. మీరు సంస్కారం గురించి పెద్దమాటలు మాట్లాడితే మాట్లాడితే ,వయసులో పెద్దవారైనా మీకు లైన్ లైన్ రాసి, నేను వివరణలిస్తూ, మీ మాటలను ఖండిస్తూ రాయటం సంస్కారం కాదు. మీకు ఆ వ్యఖ్యలను చదువుతూ సమయం వృధ కాబట్టి ఆ పని చేయటంలేదు.
      ధన్యవాదాలు.

      Delete
    38. శ్రీరాం గారు, రంగనాయకమ్మ గారు వ్రాసినా, ఇన్నయ్య గారు వ్రాసినా వ్యక్తిగత జీవితాలు వేరు. వ్యక్తుల అభిప్రాయాలు వేరు. రంగనాయకమ్మ, ఇన్నయ్యలు వ్రాసినది, చెప్పినది మార్క్సిజం కమ్యూనిస్టులు చెప్పేది కాదనుకుంటే ఎలా? ఎవరికిష్టం వచ్చినట్లు వారు మార్క్స్‌ని అన్వయించుకుని వాదించుకుంటున్నారు. మనదేశంలోనే 67 కమ్యూనిస్టు పార్టీలు తమలో తాము కొట్టుకుంటూ బూర్జువాలను విమర్శిస్తుంటారు. ఇవనీ మార్క్స్ ఏమి చెప్పాడనేదానికి సంబంధం లేని అంశాలు. మార్క్స్ నిజంగా ఏ విషయం పై ఏమి చెప్పాడు? అందులో ఏది సమాజానికి పనికివస్తుందనేదే పాయింట్. మార్క్స్ ఎక్కడ పడుకున్నాడు? ఎన్ని అక్రమ సంబంధాలున్నాయి? ఏ అంగం మీద కురుపులు లేచాయి? ఏ రంగు చొక్కా వేసుకున్నాడు? ఎన్నిరోజులకోసారి స్నానం చేశాడు? ఇలాంటివన్నీ ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ముఖ్యం తప్ప సమాజానికి అంతగా పనిలేదని నా అభిప్రాయం.( ఇవన్నీ మీరిచ్చిన ఇన్నయ్య గారి పోస్టులలో ఉన్నాయి కనుక ప్రస్థావించాను) మీరు లింకులిచ్చినందుకు నేను తప్పు పట్టడం లేదు. నేను వాటిని పూర్తిగా చదివాను చాలా పాజిటివ్‌గా. ఆ లింకులలో మొత్తం చదివితే అతి చిన్న విషయమైనది అదీ నిజమో కాదో తెలీనిది మాత్రమే మీరు పట్టించుకుంటున్నారు. నేను మార్క్స్ మానవుడిని ప్రధానం చేసి తాను చెప్పదలచుకున్నదానికి కట్టుబడి జీవితానతం ఉన్నాడని ఇన్నయ్యగారు చెప్పినదానిని చూసి మార్క్స్ పై గౌరవం పెరిగిందన్నాను. మార్క్స్ పై ఇంగ్లీషులోనే కాదు అన్ని భాషలలోనూ వ్యతిరేక కథనాలుంటాయి. అందులో ఏది నిజమో, ఏది కాదో ఎలా నిర్ధారించాలన్నది పాయింటే కదా? వ్యక్తిగత సంబంధాలెలా ఉండాలనేది ఎవరు నిర్ణయించాలి. ఒకే మాట - ఒకే భార్య అన్న రాముడు గొప్పవాడా? అష్టభార్యలు అనేక ప్రియురాళ్లున్న కృష్ణుడు గొప్పవాడా? కుంతి,ద్రౌపది లు పతివ్రతలేనా? సీత కాదా? ఇలా ప్రశ్నిస్తే ఉపయోగం లేదు. కేవలం ఆ విషయాలు మాత్రమే రామాయణ, భారతాలు కాదు. ఆ విషయాలూ రామాయణ-భారతాలలో ఉన్నాయి. ఏవి మంచివో అవి స్వీకరించాలి. ఏవి తప్పో అవి వదిలేయాలి. మీరు నమ్మినట్లు ఇన్నయ్యగారు వ్రాసినది, లేదా ఇంగ్లీషులో వ్రాసినది మార్క్స్ వ్యక్తిగతం గురించి వ్రాసినది నిజమే అయితే మార్క్స్ ఆ విషయంలో తప్పు చేసినట్లేనని నా వ్యక్తిగత అభిప్రాయం. దానిని వ్యక్తిగతంగానే చూడాలి. ఆ అంశం మార్క్స్ బోధనలపై ఏ మాత్రం ప్రభావం చూపకూడదు అంటున్నాను. ఈ పోస్టు గీత గురీంచి అయినప్పుడు ఇక్కడ మార్క్స్ గురినిచి వాదించి ఉపయోగముండదు కదా?

      Delete
    39. నిన్న నేను నిరాధారమైన ఆరోపణలు చేశాను, మార్క్స్ పై ఇన్నయ గారిని అడ్డుపెట్టుకొని నిందలు వేశాను, అది సంస్కారం గాదు అంటు నాకు హితవులు చేప్పారు. ఇప్పుడు ఆయన ఎటువంటి వారైతే నాకేమి? మార్క్స్ వేరు, మార్క్సిజం వేరు అని ప్లేట్ ఫిరాయించారు. అంతటి తో ఆగకుండా మళ్ళి, అతి చిన్న విషయమైనది. అదీ నిజమో కాదో తెలీనిది మాత్రమే" మీరు పట్టించుకుంటున్నారు అని అంట్టున్నారు. మీరు దానిని నమ్మితే అని అంటూ వాస్తవాన్ని, నమ్మకమతో ముడిపెడుతూన్నారు.
      నేను ఎన్నో సాక్షాలు మీ బ్లాగులో ఉంచాను.ఒకరు గాదు, ఇద్దరు గాదు ఎంతో మంది చరిత్రకారులు ఆయన గురించి ఈ విషయం రాశారు. అవి ప్రపంచంలో అతి పెద్ద పత్రికలో ప్రచూరించారు. వాటిలో ఇలా మార్క్స్ గురించి, ఆయన వైవాహిక జీవితం గురించి తప్పుడు సమాచారం రాస్తే , ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ పేపర్ వాళ్లను వాయిస్తారు.

      నేను ఎన్నో సాక్షాలు ఇచ్చాను. ఇంకకావాలంటే, నేను చదివిన పాల్ జాన్ సన్ రాసిన "ఇంటేల్క్ ట్యువల్స్" పుస్తకంలో పేజీలను వీలు చూసుకొని పోటొ తీసి, పేజి నంబర్లతో సైతం ఇస్తాను. జై, శ్రీకాంత్, శ్రీకాంత్ చారి,హరిబాబు మొదలైన వారందరికి ఇంగ్లిష్ వచ్చు. అవి చదివి నిజానిజాలను వారే మీకు తెలియజేస్తారు. అప్పుడు మీకు ఇంకా అపనమ్మకం ఉంటే నివృత్తి అయిపోతుంది. అంతే గాని ఇంకా నేను ఆయనపై నిందలు వేశాను,అసత్య ఆరోపణలను చేశానని మాత్రం అనకండి. ఆయన వ్యకిగత జీవితం పట్టించుకొంట్టున్నాని నాకు సుద్దులు చెప్పకండి. ఎందుకంటే ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు చర్చలో కి తప్పక వస్తాయని పైన రాశాను.

      *మార్క్స్ పై ఇంగ్లీషులోనే కాదు అన్ని భాషలలోనూ వ్యతిరేక కథనాలుంటాయి. అందులో ఏది నిజమో, ఏది కాదో ఎలా నిర్ధారించాలన్నది పాయింటే కదా?*

      ఇదొక పాయింటా? ఆయన జీవితాన్ని ఆములాగ్రంగా పరిశీలించిన చరిత్రకారులు, ఆయనపై అకేడేమిక్ పరిశోధనలు చేసినవారు ప్రపంచవ్యాప్త్రంగా ఎంతో మంది ఉన్నారు. ఎమిటి మళ్ళీ మీరు,నేను ఏది నిజమో, ఏది కాదో నిర్ధరించేది, నిర్ధారణకు వచ్చేది. మీదగ్గర సమయం,సంపదా ఉంటే లండన్ కి వేళ్లి నిర్దార్రించుకొంటానంటే మీ ఇష్టం. మీరిలా అనవచ్చనే ముందుగానే మార్క్సిస్ట్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోయింది. మార్క్స్ గారు,ఆయన కమ్యునిస్ట్ పార్టి నేడు ఏ అధికారానికి థ్రెట్ కాదు. యన పై అబద్దాలను వారు రాసి ప్రచారం చేయవలసిన అవసరంలేదు అని కూడా చెప్పాను.
      _______________________

      మీరు ఇక్కడ రాముడు,కృష్ణుడు గురించి ప్రస్థావన తేవటం చర్చకు అనవసరం. మొన్నటి వరకు తెలుగునాట కమ్యునిస్ట్ లు మార్క్స్ ని చారిత్రక పురుషుడన్నట్లు ప్రచారం చేసారు. అది మరచిపోతే ఏలా? ఆయన పుస్తాకాలను చదివి,ప్రపంచ ఆర్ధికపరిస్థితి అంతా తెలుసన్నట్లు, తెంథ్ క్లాస్ హానర్స్ చేసినవారు రచయితలుగా అవతారమెత్తి, ఆనాటి సమాజన్ని, వేల సంవత్సారాలక్రితం జరిగిన సంఘటనలను ఈనాటి అద్దాలు వేసుకొని చూస్తూ, హిందూ మత గ్రంథాలల్లోనే లోపాలను వెదుకుతూ రాయటం లేదా? దశాబ్దాలుగా రచనలు చేస్తూన్న వారికి వందేళ్ల క్రితం మార్క్స్ మహాశయుడి జీవితం లోపాలు కనపడలేదా? వారి నిజాయితి ఎంత? అని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. అంతే.
      నేను ఇంతటితో చర్చను ముగిస్తున్నాను. ఇక రాయటానికి ఎమి లేదు. కొనసాగించే కొద్ది అది వ్యక్తిగతం గా మారుతుంది. అది అభిలాషణియం కాదను కొంటాన. మీకు కావాలంటే పుస్తకంలో పేజిలు ఇస్తాను. మీరు నావ్యఖ్యలను చదివి మళ్ళి అందులో ఎదో ఒకదానిని పట్టుకొని చర్చను పొడిగించరని ఆశిస్తాను. ధన్యవాదాలు.

      Delete
    40. శ్రీరాం గారు, ఈ అంశంపై మీకు వ్రాసే చివరి కామెంట్ ఇది. మీరు చెప్పిన పేర్లు లేదా ఇంకా ఎవరైనా సరే అందరికీ ఇప్పటివరకూ మన ఇద్దరి కామెంట్లు అన్నీ చదివి నేను ప్లేటు ఫిరాయించానా? లేదా? అని మీరు నిర్ధారించుకోండి. లేదా మీరే మరోసారి చదివి నిర్ధారించుకోండి. అన్ని కామెంట్లూ ఇక్కడే ఉన్నాయి. మార్క్స్‌పైనా, మార్క్సిజంపైనా జరిగే విష ప్రచారం వేరు. మార్స్కిజాన్ని వ్యతిరేకించడం వేరు. నేనూ మార్క్సిజంలోని చాలా అంశాలతో విభేదిస్తాను. అది విషయపరంగా ఉండాలి. వ్యక్తులపై దాడి చేసే విధంగా కాదు. మీరు ఎటొచ్చీ మార్క్స్ పై వ్యక్తిగత దాడికే పూనుకుంటున్నారు. మీరిచ్చిన అన్నిలింకులూ చదివాను. ప్రత్యేకంగా మళ్లీ చెప్పిన లింకు అదే మార్క్స్ అక్రమ సంబంధం - సంతానం గురించీ నా అభిప్రాయం చెప్పాను. మీకు అనుకూలంగా లేదా మీరు అనుకుంటున్నట్లు మీరు ఊహిస్తున్నట్లు వేరొకరు అభిప్రాయం చెప్పలేరు. ఇక్కడ ఇంగ్లీషు సమస్య కాదు. మీరు మార్క్స్ పై బలవంతంగా, గుడ్డిగా అవసరానికి మించి వ్యతిరేకత ప్రదర్శించడమే కనపడుతున్నది. నేను పూజలు చేయాలా? దండలు వేయాలా? అని చెప్పడం ఏ సంస్కారమండీ? మార్క్స్ పై చరిత్రకారులు అంత పరిశోధన చేస్తే ఇంకా ప్రపంచవ్యాపితంగా ఆయన చెప్పిన విషయాలలో పనికివచ్చేవి తీసుకుని ముందుకుపోయేవారు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ రెండు కోణాలూ ఉన్నాయనేది గుర్తించాలి. మనకిష్టమొచ్చిందే గుర్తించి ప్రచారం చేయడం అనేది వ్యక్తిగతవిషయం. హిందూ మత గ్రంధాలను విమర్శించేవారి అర్హత టెంత్ క్లాస్ అంటూ ఎద్దేవా చేసే ముందు అవి వ్రాసిన వారు ఏ పట్టభద్రులో కూడా ఆలోచించాలి. వాల్మీకి కి ఏ డిగ్రీ ఉన్నది. డిగ్రీలతో మాత్రమే జ్ఞానం వస్తుందా? నేను కాదనే అనుకుంటున్నాను. ఎంత చదివారన్నది ముఖ్యం కాదు. ఏమి గ్రహించారు? ఏమి చెప్పారు? ఎలా చెప్పారు? అనేదే ముఖ్యం.

      Delete
    41. This comment has been removed by the author.

      Delete
  4. భగవద్గీతని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు.
    దయ చేసి భగవద్గీతను వివాదాస్పదం చెయ్యకండి.
    ఈ వివాదంతో కొందరు అనవసరంగా గీతకి వక్రభాష్యం చెపుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. గీతను జాతీయ పవిత్ర గ్రంధంగా ప్రకటించకపోతే వచ్చే నష్టం ఏమీ లేదన్న మీరన్న వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను బోనగిరి గారు.

      Delete
  5. రాజ్యాంగం "ప్రవిత్రం" గా ఉండాలా? అసలు మీరు కావాలనే ఆ పదాన్ని వాడారా? లేక ఇంకేమీ తట్టక ఆ పదాన్ని వాడారా?

    పవిత్రత అన్నది మనం వదిలించుకోవాల్సిన ఒక భూతం. దానిస్థానే గౌరవం సరిపోతుంది. ఒకసారి పవిత్రం అని ఒకదానిని లేబుల్ చేశాక, దానిలోని లోపాలను objectiveగా చూసి సరిచేసుకోగల వివేచన నశిస్తుంది. సరిచేసుకోలేకపోగా, ఆ లోపాలనే defend చేస్తాం. ప్రతి మత గ్రంధం విషంలోనూ ఇది నిజమని ఋజువవుతుండగా, ఆ లిస్టులోకి రాజ్యాంగాన్నికూడా ఎక్కుంచాలా? రాజ్యాంగం humanizedగా ఉంటే సరిపోదా?

    ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు ఏమి ఇచ్చిపుచ్చుకోవాలనేదానిమీద మార్గదర్శకాలుండాలా? దేశ వ్యవస్థలకి పవిత్ర గ్రంధం ఎందుకుండాలి? అసలు పవిత్ర గ్రంధం హోదా significance ఏమిటి? సరే ఒక గ్రంధం దేశ పవిత్ర గ్రంధమనుకోండి ఇప్పుడేంచేస్తారా గ్రంధాన్ని? ప్రతి ఒక్కరూ దాన్ని చదివి పరీక్షలేమైనా రాయాల్సుంటుందా?

    మీరు ఏదో హిట్లకోసం ప్రశ్న లడుగుతున్నట్లుందేగానీ, చర్చకోసంకాదు.

    ReplyDelete
    Replies
    1. జాతికి పవిత్ర గ్రంధమంటూ ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. అలా ఏదైనా ఉండాలనుకుంటే రాజ్యాంగాన్నే ఆ విధంగా మెరుగుచేసుకోవచ్చనేది నా ఉద్దేశం. సుష్మా వ్యాఖ్యకు సమాధానంగా చెప్పిన నేపధ్యాన్ని గమనంలో ఉంచుకుని చూస్తే నేనన్నది అవగతమవుతుంది. మీరనుకుంటున్న లేదా అంటున్న మత గ్రంధాలలోని పవిత్రతలో ఎప్పుడూ మార్పులేనిది. నేనంటున్న పవిత్రత ఎపుడూ జరిగే ప్రాసెస్ అని చెప్పినదానిని మీరు గమనించలేదనుకుంటాను. పవిత్రత అనేదానికి ఎవరు ఏ అర్ధం వాడుకుంటారనేది వారి వారి ఆలోచనలను బట్టి ఉంటుంది. కొందరికి శీలం పవిత్రం , కొందరికి ఆశయం పవిత్రం, కొందరికి ఆచరణ పవిత్రం .... ఇలాగా కనపడుతుంటుంది. ఓ పదం అర్ధాన్ని లోతుగా అర్ధం తీయాల్సిన అవసరం వల్ల ప్రయోజనం లేదు. పవిత్రం అనే పదాన్ని మతానికి సంబంధించిన సందర్భాలలో, అంశాలలో మాత్రమే వాడాలని నిబంధన ఉన్నదా? మీరు నిర్ణయిస్తున్నారా? ఇక్కడ చర్చ మతగ్రంధమైన గీతను ఒక మతానికి కాకుండా దేశం మొత్తానికి పవిత్ర గ్రంధంగా ప్రకటించాలని విదేశాంగ మంత్రిగా ఉన్న వారు ప్రకటించడాన్ని చర్చించడం హిట్లకోసం అన్నట్లుగా మీరు వ్యాఖ్యానించడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బాధ్యత కలిగిన ఓ కేంద్ర మంత్రి అలా వ్యాఖ్యానించడం ఖచ్చితంగా చర్చనీయాంశమేనని నా అభిప్రాయం.

      Delete
    2. What she had opined was sheer nonsense. What's there in to discuss??

      If not for the heck of it? why do you pose a question and then wait for commentators (aka hits)?

      Delete
    3. నాకు ఇంగ్లీషు రానందున మీ వ్యాఖ్యను అర్ధం చేసుకోలేను. వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయగలరు.

      Delete
  6. మీరు "పవిత్రం" అన్న పదాన్ని ఏ అర్ధంలో వాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్ధంకాలేదు. పవిత్రమైనది అంటే నాకు తెలిసిన అర్ధం "ఎదురు ప్రశ్నించరానిది", "పూజించదగినది", "విమర్శించరానిది", "లోపాలు లేనిది" అని. రాజ్యాంగం అలాంటిదైననాడు ఇక దానికి సంస్కరణలు ఉండబోవు. కొన్నాళ్లకి అది irrelaventగా మారిపోయి, ఒక మతగ్రంధంలాగా అర్ధంపర్ధంలేని నియమాలతో నిండిపోతుంది. ఆస్థయికి ఏదేశపు రాజ్యాంగమూ దిగజారకుండుగాక.

    ReplyDelete
    Replies
    1. పవిత్రగ్రంధంగా గీతను ప్రపోస్ చేయాలని ఓ కేంద్రమంత్రి అన్నప్పుడు అంత పవిత్రంగా చేయాలనుకుంటే రాజ్యాంగాన్నే అలా చేయండని చెప్పే ఉద్దేశంలో వాడాను. పూజనీయం, మార్చలేనిది అనే అర్ధంలో నేను వాడాలని అనుకుంటే నిరంతర ప్రాసెస్ అని అదే వ్యాఖ్యలో నేను చెప్పినది ఎందుకు గమనించరు. నిరంతర ప్రాసెస్ అంటే నిరంతరం రాజ్యాంగంలో మార్పులు ఉంటాయనే కదా? ఏ మతగ్రంధాన్ని పవిత్రగ్రంధంగా చేయాలన్న ఆలోచన బదులు రాజ్యాంగాన్నే ఇంకా మంచిగా తయారు చేయమనే ఉద్దేశంలో వాడాను.

      Delete
    2. కొండలరావుగారు,

      వివాదం మొత్తం "పవిత్రత" అన్న పదం మీద నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మీ ఉద్దేశం వేరైనప్పటికి ఆ పదం సరైన విధంగా ప్రయోగించ బడలేదని నేను కూడా అనుకుంటున్నాను.

      పవిత్రతను దేనికీ ఆపాదించలేం. అది ప్రజల నమ్మకం వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణకు నేను ఒక అద్భుతమైన శిల్పాన్ని (ఏ దేవునిదీ కాదు) చెక్కాననుకోండి. అది ఎంత అద్భుతంగా వున్నప్పటికీ పవిత్రమై పోదు. కాని ప్రజలు నమ్మితే ఒక రాయి కూడా తెల్లారేలోపు పవిత్రమై పోతుంది!

      కాబట్టి దేన్నయినా మనం గొప్పగా తయారుచేయగలం, పవిత్రంగా కాదు. అదే సమయంలో ఎన్ని లోపాలున్నా ఒక మతగ్రంధం సంబంధిత మతస్థుల చేత పవిత్రమైందిగా భావించ బడుతుంది. గొప్పదనానికి సామర్థ్యం గీటురాయి, పవిత్రతకు నమ్మకమే గీటురాయి.

      Delete
    3. శ్రీకాంత్ చారి గారు, నేను పవిత్రం అన్న పదాన్ని ఎందుకు వాడానో చెప్పాను. సుష్మా స్వరాజ్ దేశానికి జాతీయ పవిత్ర గ్రంధంగా భగవద్గీతను చేయాలని అన్నప్పుడు అంత పవిత్రంగా ఒక గ్రంధాన్ని ఉండాలని కోరుకుంటే అదేదో రాజ్యాంగాన్నే అలా మార్చండనే రిటార్ట్ గా చెప్పాను. ఆ సందర్భంలోనే అలా చేయడం నిరంతర ప్రాసెస్ అని చెప్పాను. పవిత్ర గ్రంధాలు అయితే ప్రాసెస్ లు ఉండవు కదా? అవి దైవాంశ సంభూతులు చెప్తారు కనుక ఎదురు మాట్లాడక వినాల్సినవి అయి ఉంటాయి. కానీ నేను చెప్పే రాజ్యాంగానికి మార్పులు చేసుకోవచ్చు. కనుక నేను ఎందుకు? ఎలా? వాడానో అవగతం కాకపోవడం ఇక్కడ పెద్ద సమస్య కాదు. సమస్య చేయాలనుకుంటే దేనినైనా చేయవచ్చు. మీరన్నట్లు ఈ సందర్భంలోనూ రాజ్యాంగాన్ని పవిత్రగ్రంధం అని వాడకూడదు అంటే నాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాంగాన్ని పవిత్రగ్రంధం అనాలని నేను పట్టుపట్టడం లేదు. నేను చెప్పదలచుకున్నది ఏమిటో అవగతం కావడానికి అది ఆటంకంగా ఉండి వేరే అర్ధం ఇస్తుందనిపిస్తుంటే తప్పకుండా మార్చి చెప్తాను. నా అభిప్రాయం భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంధంగా ప్రకటించాలనుకోవడం తప్పు. ఒక మత గ్రంధాన్ని అలా చేయడం వల్ల జాతికి ప్రయోజనాలేమీ లేవు. ఈ ప్రయత్నాలను అందరూ వ్యతిరెకించాలనేదే నా అభిప్రాయం. పవిత్రమైన అనే పదానికి లోతైన అర్ధం తెలుసుకోవలసి ఉన్నది నా వరకు.

      Delete
  7. 150 మంది ముస్లిం మత పెద్దలు భాజపాకి సపోర్త్ ఇచ్చారంటున్నారు కదా. మతం పెద్ద సమస్య కాకపోతే కాంగ్రెస్‌కీ, భాజపాకీ మధ్య తేడా ఏమిటి? ఆ రెండూ కేవలం విదేశీ పెట్టుబడుల వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని జనాన్ని నమ్మించే పార్తీలు. ఆర్థిక అజెందాలో అయితే ఆ రెండు పార్తీల మధ్య ఏమాత్రం తేడా లేదు. మతం విషయానికు వస్తేనే భాజపాతో ప్రమాదం ఎక్కువ. కేవలం విదేశీ పెట్టుబడులు తప్ప ఏమీ అవసరం లేదని చెప్పడానికి నిజ జీవితంలో అభివృద్ధి నిరోధకమైన కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని పెంచి పోషించే హిందూ మతాన్ని నమ్మడం అవసరమా? హిందూ, ఇస్లాం ఈ రెండు మతాలూ సమానమనిపిస్తే కాంగ్రెస్‌నే గెలిపించొచ్చు, దాని కోసం భాజపాని గెలిపించడానికి ముస్లిం మత పెద్దల చేత ప్రచారం చెయ్యించాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. *అభివృద్ధి నిరోధకమైన కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని పెంచి పోషించే హిందూ మతాన్ని నమ్మడం అవసరమా?*
      Caste plays dominant role in Pak election
      Shahid Khaqan Abbasi, a four-time Pakistan Muslim League (N) parliamentarian, downplays the importance of biradari (caste) factor in the May 11 elections and counts on his party's popularity to see him through. Yet as a hardnosed politician, he has the biradari breakup of his Murree-Kahuta constituency near Islamabad at his fingertips - Rajputs 30% and the rest Jats, Arians, Gujjars etc.

      http://timesofindia.indiatimes.com/world/pakistan/Caste-plays-dominant-role-in-Pak-elections/articleshow/19916533.cms


      Delete
    2. *150 మంది ముస్లిం మత పెద్దలు భాజపాకి సపోర్త్ ఇచ్చారంటున్నారు కదా*
      ఆ లింక్ ఇవ్వటానికి కారణం, సెక్యులర్ ఇస్టులు అని పేరు తగిలించుకొని వేరు వేరు రూపాలలో బిజెపి ని మతవాద పార్టి అంట్టు గోలచేసిన వారిని ముస్లింలు కూడా నమ్మటంలేదని తెలుసుకోవాలి.వారు బిజెపి కి సహాకారం అందిస్తున్నారు. మోడి వస్తే సెకుయులరిజం కూ హాని, గుజరాత్ అని పదేళ్లు గొంతు చించుకొన్నా, ప్రజలు పట్టించుకోలేదు. జాతీయ మీడీయా ప్రభావo కూడా ఇటువంటి అంశాలపై ఉంట్టుందని అనుకోలెము. డేటా అనాలిసిస్ కంపెనిలలో పనిచేసే బిజెపి పార్టి అభిమానులు, అర్నబ్ గోస్వామి ప్రోగ్రాం ఇంతకి ఎంతమంది చూస్తున్నారని లెక్కలు తీశారు, తేలిందేమిటంటే నాలుగు లక్షలని. 125 కోట్ల జనాభ గలదేశంలో నాలుగు లక్షలు ఎంత శాతం. దేశ జనాభా పై వీరు చూపించే ప్రభావం సంద్రం లో నీటి బొట్టంత. ఓపిక ఉంటే రోజుకు వందటపాలు బ్లాగుల్లో బిజెపి తిడుతు రాసుకొన్న నష్టం లేదు. తెలుగునాట బిజెపి మూడూ/నాలుగో స్థానంలో ఉండే పార్టి. అదేమి అధికారంలో ఉన్న పార్టి కాదు, ఇప్పుడే అధికరంలో కి వచ్చే పార్టికాదు. వీరి రాతల ద్వారా ఆంధ్రాలో అడ్డుకోవటానికి. తెలుగు బ్లాగులో వారు ఎంత రాసుకొంటే అంత సమయం వారికే నష్టం. Period.

      Delete
    3. You didn't reply to my question. If Hinduism and Islam are equal, it can be recommended to vote for Congress. Who needs a Hindutva party then?

      Delete
    4. "హిందూ, ఇస్లాం మతాలు రెండూ సమానమే కానీ హిందూ మతం ఎక్కువ సమానం, ఇస్లాం మతం తక్కువ సమానం అనుకునే భాజపానే ముస్లింలు నమ్ముతారు" అన్నట్టు ఉంది మీ వాదన.

      స్కూల్ పుస్తకాలలో అన్ని మతాలూ సమానమనే వ్రాస్తారు కానీ నిజ జీవితంలో మనకి మన మతం ఎక్కువ సమానం, వేరే మతం తక్కువ సమానం. ఈ హిపోక్రిసీని ఆమోదయోగ్యం చెయ్యడానికి ఒక మతతత్వ పార్తీకి సపోర్త్ ఇచ్చి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం అవసరమా? ఆ అవసరం లేదు కాబట్టే భాజపా కంటే కాంగ్రెస్ మేలు అన్నాను. ఆర్థిక అజెందా విషయంలో నేను కాంగ్రెస్, భాజపా రెండిటికీ వ్యతిరేకమే.

      Delete
    5. కులాలు హిందూమతంలో నే ఉన్నాయి అని చెప్తున్నారు కనుక ఆ లింక్ ఇచ్చాను. బిజెపి కన్నా, కాంగ్రెస్ మంచిది అని మీ అభిప్రాయం. మీ ఇష్టం వచ్చిన పార్టికి మీరు ఓటు వేసుకోండి.

      Delete
    6. కాంగ్రెస్ కూడా మతాన్ని వాడుకుని ఓట్లకోసం ప్రాకులాడని పవిత్రమైన పార్టీ ఏమీ కాదు. అయోధ్యలో వివాదాస్పద గుడిలో తాత వేయించిన తాళాలను తీయించినది మనవడే. ముస్లిం మైనారిటీ ఓట్లకోసం ట్రిక్కులకూ కొదవలేదు. BJP అంత గాకున్నా కాంగ్రెస్ ఏమీ పూర్తి లౌకిక విలువలను కాపాడుకోవడానికి కంకణబద్దహమై ఏమీ లేదు. ఆర్ధిక విధానాలలో విదేశీ పెట్టుబడులకు బార్లా తలుపులు తీయడంలో దొందూ దొందే.

      Delete

  8. ప్రతీది ఇలాగ వివాదాస్పదం చేస్తారెందుకని?ప్రభుత్వనిర్వహణ,దేశపరిపాలనలకు,సంబంధించినవరకు,రాజ్యాంగమేఅ మనం పాటించవలసినది.భగవద్గీతని ఒక పవిత్రగ్రంథంగా మన సామాజిక,వ్యక్తిగత జీవితాల్లో పాటించుకోవచ్చును. ఈరెండు పుస్తకాలకి వైరుధ్యమెందుకు?

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,
      గీతను BJP వారే వివాదాస్పదం చేస్తున్నారు. హిందువులు లేదా గీతను నమ్మేవారు, గీతలోని మంచిని స్వీకరించేవారు దానిని జాతీయ పవిత్రగ్రంధంగా ప్రకటించకపోయినా గౌరవిస్తారు. గీతను నమ్మనివారికీ అపుడు ఇబ్బంది లేదు. గీతలోని చెడుని విమర్శించేవారికి ఇబ్బందిలేదు. అదే పవిత్రగ్రంధంగా ప్రకటిస్తే గీతలోని చెడుని విమర్శించే భావప్రకటనకు ఆటంకం కాగలదు కదా? అది తప్పే కదా? అలా చేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమే కదా? అలాంటప్పుడు ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాల్సిందే కదా? దీనిని తిప్పి కొట్టడం అంటే గీతపై దాడి కాదు. గీత ఆధారంగా భావప్రకటనపై జరుగుతున్న కుట్రను తిప్పి కొట్టడమే కాగలదని అభిప్రాయపడుతున్నాను.

      Delete
  9. కొండలరావు గారూ, సుష్మ స్వరాజ్ గారు "పవిత్ర గ్రంధం" అనలేదని తెలిసింది. ఆవిడ వాడిన పదం "రాష్ట్రీయ గ్రంధం" అట.

    ReplyDelete
    Replies
    1. నిన్న ప్రజాశక్తిలో వచ్చిన వార్త అది. ఆంధ్రజ్యోతి చానెల్ లో కూడా దీనిపై ఓ బులిటెన్ వచ్చింది. మరోసారి చూసి నిర్ధారించుకుంటాను. ధన్యవాదములు జై గారు.

      Delete
    2. అవును జాతీయ గ్రంథం (national scripture) అని అన్నారు.
      ముందు మీరు వ్రాసినట్టే నేనూ అనుకున్నాను.
      అలాగే మీరు రాజ్యాంగాన్ని ఈ వివాదంలోకి తీసుకురావడం కూడ అనవసరం.

      Delete
    3. @జై గారు, అనుభవం, ఎంతో చరిత్ర పరిజ్ణానం తెలిసిన మీకు కమ్యునిస్ట్ ల ప్రపగండా పేపర్ లో వచ్చే వార్తల గురించి మళ్ళి వివరణ ఇవ్వాల. ప్రతి ఇంగ్లిష్ పేపర్లో నేషనల్ బుక్ అని రాసి ఉంది. కాని కమ్యునిస్ట్ లు పవిత్ర గ్రంథం అని కావాలనే రాసుకొన్నారు. దీనినే ఇంత వక్రీకరైంచిన వీరు రేపు బిజెపి రామాలయం కట్టాలని ముందుకు వచ్చినపుడు ఎలా వక్రికరిస్తారో!

      Delete
    4. శ్రీరాం గారూ, మార్క్సిస్టు పార్టీ అధికార పాంఫ్లెట్, పచ్చ పార్టీ అనధికార బాకా వగైరా పత్రికలు తప్పుగా చిత్రీకరించడం వారి రాజకీయ అజెండా కాదేమో? సుష్మా వాఖ్యను సరిగ్గా తర్జుమా చేయకపోవడం వారి హిందీ అవగాహనా రాహిత్యం వల్లనని అనుకుంటా.

      Delete
  10. పవిత్ర అని కాదు రాష్ట్రీయ అంటున్నారు. నేను ప్రజాశక్తి లింకు సోర్స్ ఇచ్చాను. అయినా సరే జాతీయగ్రంధంగానైనా ఇపుడు గీతను ప్రకటించాలనుకోవడమూ తప్పే. రాజ్యాంగం ప్రకారం ఏ మతగ్రంధంలోని అంశాలనైనా స్వేచ్చగా చెప్పాలనుకున్నప్పుడు ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు గీతను ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు. మెజారిటీ మతస్తుల మనోభావాల ఆధారంగా ఓటుబేంక్ రాజకీయాలకు పాల్పడే దురుద్దేశమే తప్ప లౌకిక రాజ్యంలో మతగ్రంధాలను రాష్ట్రీఅయ గ్రంధాలుగా చేయడమూ తప్పే. అలాంటి ఆలోచనలను విరమించుకోవలసిందే. ఇక రాజ్యాంగాన్ని నేను వివాదం చేయడం లేదు. పవిత్రత అంటే మతగ్రంధాలకే ఉండాలి - రాజ్యాంగానికి ఉండకూడదు అంటే ఆ పదంపై మతాలవారికి మోనోపలీ ఇస్తారా? ఆ అవసరం లేదు. పవిత్రత అంటే నియమంగా అని అర్ధం. రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తారు. మత గ్రంధాలను ఏ మతం వాటిని ఆయా మతస్థులు మాత్రమే గౌరవిస్తారు. ఆ రకంగా చూసినా రాజ్యాంగమే మతగ్రంధాలకంటే గొప్పది. ఓ లైబ్రరీల సైలెంట్ గా ఉండడం అనేది ఆ ప్రాంతం పవిత్రత. అలా ఓ పదం పై మత సంస్థలకు మోనోపలీ ఇవ్వాల్సిన అగత్యం లేదనేదే నా అభిప్రాయం. పవిత్రత అనేది మతాల గుత్తసొత్తు కానే కాదు. పవిత్రతని వదిలించుకోవడం కాదు అసలైన అర్ధం కల్పించాలి. మతాలు పవిత్రమైనవి కావు. మానవతా విలువలు పవిత్రమైనది. శ్రమ పవిత్రమైనది. ప్రజాస్వామిక విలువలు కట్టుబాట్లు పవిత్రమైనవి. ఇలా ఓ పదం అర్హ్దం నిర్ధారించాల్సినది మతపరమైన సాహిత్యంతో మాత్రమే అని నేననుకోవడం లేదు.

    ReplyDelete
  11. @UG Sriram,
    Tha same innaiah has published umpteen posts trashing Bhagavadgita. It'll be good if you those links also

    ReplyDelete
  12. @UGSriram,
    అదే ఇన్నయ్య భగవద్గీత ను ట్రాష్ చేస్తూ లెక్కలేనన్ని పోస్ట్ లు రాశారు. మరి వాటి లింకులు కూడా ఇస్తే బాగుండేది.

    ReplyDelete
    Replies
    1. @ఉలిపికట్టే, ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిస్ట్ లు ప్రభావం ఎప్పుడో తగ్గిపోయింది. వాళ్లమి అధికారం లోకి వచ్చే పరిస్థితిలో ఏ దేశంలోను లేరు.కమ్యునిస్ట్ వారు ఏ అధికార పార్టికి థ్రెట్ కాదు. కనుక మార్క్స్ మీద అబద్దాలను రాసి ప్రచారం చేయవలసిన అవసరం ఇప్పుదు ఎవ్వరికి లేదు. కాకపోతె ఆయనను మన తెలుగువారు మరీ ఎక్కువగా ఊహించుకొంటారు కనుకతెలిసింది రాశాను. కొండలరావుగారికి ఇంగ్లిష్ భాష పై పట్టులేదని వారే చెప్పారు. అవి ఆ లింక్ లు ఇవ్వటానికి కారణం తెలుగులో ఉండటమే! భగవద్గీత లింక్ లు ఇంత క్రితం బొందలపాటి సీతారం ఈ బ్లాగులో కొండల రావు గారికి ఇచ్చారు.జీవితకాలంలో ఒక్కసారి కూడా ఫాక్టరి కు పోకుండా పుస్తకాలు రాశాడు. ఇంగ్లిష్ బాగా వస్తే ఎన్నో పుస్తకాలు ఆయన గురించి రాసినవి ఉన్నాయి.మీరు చదువుకోవాచ్చు. మతం మత్తుమందు అంట్టు ఆయన చెప్పినా, వాస్తవానికి ఆయనపై క్రైస్తవ మత ప్రభావం ఎంతో ఉంది. అభ్యుదయ సమాజం అంట్టుచెప్పిన మూలభావాలు,క్రైస్తవ మతవిలువల నుంచి తీసుకొన్నవే. చదివి వీలైతే తెలుగు లో కొండలరావుగారికి కూడా చెప్పండి.
      1. The Theology of Communism
      http://www.airpower.maxwell.af.mil/airchronicles/aureview/1969/jan-feb/scharlemann.html


      2. Pls read last four paragraphs starting with line till end of the article.

      Between Marx’s lovers and his work, Jenny’s life was never easy:
      http://www.nytimes.com/2011/09/25/books/review/love-and-capital-by-mary-gabriel-book-review.html?pagewanted=all&_r=0

      3. If you want to reference then please read Intellectuals by paul johnson book

      Delete
    2. శ్రీరాం గారు, ఇండియాలో ఉన్నవారిపై హిందూ మత ప్రభావం ఉన్నట్లే మార్క్స్ పై క్రైస్తవం ప్రభావం తప్పక ఉంటుంది. ఇంగ్లీషు నాకు రాదనేది ఎంత నిజమో మార్క్స్ గురించి తెలిసినవారిలో ఇంగ్లీషు వచ్చిన వారూ మేధావులూ చాలామంది ఉన్నారనేది అంతే నిజం. ఉలిపికట్టె గారు అడిగింది ఇన్నయ్యగారినే క్రైటీరియాగా తీసుకోవాలంటే ఆయన గీత గురించి చెప్పిన లింకులు ఇవ్వమని. వాస్తవానికి ఈ పోస్టుకు కావలసింది గీత కు చెందిన లింకులే కదా?

      Delete
    3. ఈ మధ్య రాసిన వ్యాఖ్యలలో నేను గీత గురించి వాదించటం లేదని చెప్పాను. తెలుగులో మార్క్స్ గురించి రాసింది, ఇన్నయగాroక్కరే గనుక మీకు ఇంగ్లిష్ రాదు గనుక అవి ఇచ్చాను. ఇన్నయగారి లింక్ లిచ్చింది, ఆయన క్రిటేరియాగా తీసుకొని వాదించటానికి కాదు.నేను బ్రిటిష్ చరిత్ర కారుడు పాల్ జాన్ సన్ ఇంటేలెక్ట్యువల్స్ అనే పుస్తకాన్నిరాశాడు. అది చదివాను. అందులో మార్క్స్ గారి వ్యక్తిగతా జీవిత విశేషాలను, ఆయన పనిమనిషితో అక్రమ సంతానం గురించి రాశారు. అది చెప్పాను. అంతేకాదు ఆపుస్తకంలో ఆయన ఉత్తరప్రత్యుత్తరాలు అన్ని ప్రచూరించారు , రెఫెరెన్స్ లతో సహా ఉన్నాయి. ఆ book నేట్ లో ఫ్రీ గా దొరకదు. కొనుకొని చదవాలి. ఇక ఉలిపికట్టే కు ఇచ్చిన ఇంగ్లిష్ లింక్ లో పిల్లవాడి విషయాలు ఉన్నాయి కదా! నేనేదో లేనిది రాసినట్లు మీరు భావిస్తే ఎలా?

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top